కోలీవుడ్లో మొదట యాంకర్ గా తన జీవితాన్ని ప్రారంభించి ఆ తర్వాత బుల్లితెరపై కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ వాణి భోజన్.


ఆ తర్వాత సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈమె నటించిన మొదటి చిత్రం ఓ మై కడవులే అనే సినిమాలో సెకండ్ హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమైంది వాణి భోజన్. ఈ చిత్రంతో మంచి పేరు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మకు అనేక సినిమాలలో నటించే అవకాశాలు వచ్చాయట. ఇక ఈ ముద్దుగుమ్మ కేవలం సినిమాలలోనే కాకుండా పలు వెబ్ సిరీస్ లలో నటించే అవకాశం కూడా సంపాదించుకుంది.


 


నటనపరంగా ఈమెకు ఎన్ని ఆఫర్లు వచ్చినప్పటికీ కూడా చెప్పుకోదగ్గ పాత్రలు మాత్రం రాలేదని చెప్పవచ్చు . ఇక హీరో జైతో రిలేషన్ లో ఉన్నట్లుగా ఇప్పటికీ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే సినీ ఇండస్ట్రీలో సహజీవనం చేయడం అనేది చాలా కామన్ గా మారిపోయింది అలాంటి వారిలో నయనతార ,విగ్నేష్ వంటి వారు కూడా ఎన్నో రోజులు రిలేషన్షిప్ లో ఉండి వివాహం చేసుకున్నారు. కానీ చాలామంది నటీనటులు సైతం కొన్ని రోజులు రిలేషన్ లో ఉండి ఆ తర్వాత బ్రేకప్ చెప్పుకొని ఎవరి దారిన వారు వెళ్ళిపోతూ ఉంటారు.


 


అయితే అలా బ్రేకప్ చెప్పుకున్న తర్వాత హీరోయిన్ వాణి భోజన్ పరిస్థితి చాలా దారుణంగా మారిపోయిందట. హీరో జైతో రిలేషన్ షిప్ లో ఉండడం వల్ల ఈమె సినీ కెరియర్ మొత్తం జై చేతిలోకి వెళ్లిపోయిందని దాంతో డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు సైతం ఈమెను నేరుగా కలవలేని పరిస్థితి ఏర్పడిందట.. దీంతో ఈమెకు సంబంధించిన ఎటువంటి విషయమైనా సరే ముందు జై తో చెప్పిన తర్వాతే ఆమె దగ్గరకు వెళ్లేదని కోలీవుడ్ మీడియాలో బాగా వార్తలు కూడా వినిపించాయి.


అయితే హీరో జై కారణంగానే ఈమె ఎన్నో చిత్రాలను కోల్పోయారని తెలియజేస్తోంది.ఈ పరిస్థితి మొత్తం అర్థం చేసుకున్న హీరోయిన్ ఇకపై ఈరోజు జై తో ఉండడం మంచిది కాదని.. తన సినీ కెరియర్ కోసమే హీరో జై తో వాణి భోజన్ బ్రేకప్ చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ వార్తలు ఎంతవరకు నిజమో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయం మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: