‘లైగర్’ సూపర్ ఫ్లాప్ తో షాక్ లోకి వెళ్ళిపోయిన విజయ్ దేవరకొండ ఆ షాక్ నుండి తేరుకోవడానికి చాల సమయం పట్టింది. ప్రస్తుతం విజయ్ చేస్తున్న ‘ఖుషీ’ మూవీ తప్పించి మరే మూవీ సెట్స్ పై లేకపోవడంతో ఈ మూవీ తరువాత చేయబోయే సినిమాల గురించి విజయ్ దృష్టి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.



విజయ్ వరస ఫ్లాప్ లలో ఉన్నప్పటికీ అతడు డేట్స్ ఇస్తే చాలు అనేకమంది నిర్మాతలు సినిమాలు తీయడానికి రెడీగా ఉన్నారు. ఈ లిస్టులో ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ కూడ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దిల్ రాజ్ ఇచ్చిన అడ్వాన్స్ విజయ్ దేవరకొండ వద్ద ఉండటంతో ఒక మూవీ చేయడానికి విజయ్ ఆశక్తి కనపరుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.



దీనితో దిల్ రాజ్ ఇప్పటికే ఇంద్రగంటి మోహన్ కృష్ణను రంగంలోకి దింపి విజయ్ కు కథ చెప్పే బాధ్యతను అప్పచెప్పినట్లు తెలుస్తోంది. విజయ్ కూడ ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో నటించడానికి ఆశక్తి కనపరుస్తిన్నప్పటికీ ఫైనల్ నిర్ణయం లేటెస్ట్ విడుదలైన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ మూవీ రిజల్ట్ ను బట్టి ముందుకు వెళ్లాలని విజయ్ ఆలోచన అని తెలుస్తోంది. అయితే ఈ మూవీకి డివైడ్ టాక్ రావడంతో ధైర్యం చేసి విజయ్ ప్రస్తుతం ఉన్న ఫ్లాప్ ల పొజిషన్ లో మోహన్ కృష్ణ వైపు అడుగులు వేస్తాడా అన్న సందేహాలు చాలామందికి కలుగుతున్నాయి.



ఇది ఇలా ఉండగా మోహన్ కృష్ణ మహేష్ బాబుతో ఒక సినిమాను చేయడానికి గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు. అది కుదరకపోతే నాగచైతన్యతో అయినా ఒక మూవీ చేయాలని ఆరాట పడుతున్నాడు. అయితే వారంతా లేటెస్ట్ గా విడుదలైన ‘ఆ అమ్మాయి గురించి చెప్పాలి’ మూవీ రిజల్ట్ గురించి ఆలోచిస్తున్న పరిస్థుతులలో డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈమూవీ ఎంతవరకు మోహన్ కృష్ణకు అవకాశాలు తెచ్చిపెడుతుంది అన్న విషయమై భిన్నాభిప్రాయాలు చాలామందికి కలుగుతున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: