సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరు గాంచిన ఇంద్రగంటి మోహన్ కృష్ణ సాధారణంగా వివాదాలకు దూరంగా ఉంటాడు. ఆయన సినిమాలు కూడ చాల సున్నితంగా ఉంటాయి. అయితే కమర్షియల్ డైరెక్టర్ గా మారి టాప్ హీరోలతో సినిమాలు తీయలేకపోతున్నాను అన్న అసంతృప్తి ఇంద్రగంటి మోహన్ కృష్ణకు ఏర్పడిందా అన్న సందేహం లేటెస్ట్ గా విడుదలైన ‘ఆ అమ్మాయి గురించి మీతో చెప్పాలి’ మూవీ చూసిన వారికి కలుగుతోంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.


సుధీర్ బాబు హీరోగా విడుదలైన ఈమూవీలో ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఫిలిం ఇండస్ట్రీలోని కమర్షియల్ ట్రెండ్స్ ను టార్గెట్ చేస్తూ కొన్ని సంభాషణలు వ్రాసాడు. ఇందులో హీరో పాత్ర పేరు నవీన్ వరసగా ఆరు సూపర్ హిట్లు ఇచ్చిన డైరెక్టర్ ‘మొదటి మగాడు’ ‘కసక్’ లాంటి చిత్ర విచిత్రమైన టైటిల్స్ తో బ్లాక్ బస్టర్లు తీస్తూ ఉంటాడు. ఈసినిమాలు చూసి జనం తిట్టుకుంటూ ఉన్నప్పటికీ నిర్మాతలకు మంచి డబ్బులు వస్తూ ఉండటంతో ఆ దర్శకుడు కి భారీ అడ్వాన్స్ లు ఇచ్చి సినిమాలు తీస్తూ ఉంటారు.


వాస్తవానికి ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఈ మూవీలో ఎవరి పేరును ప్రస్తావించక పోయినప్పటికీ ఎవరో ఒక కమర్షియల్ డైరెక్టర్ ను దృష్టిలో పెట్టుకుని ఈ డైలాగ్స్ ఆయన వ్రాశాడా అన్న సందేహాలు కొందరికి వస్తున్నాయి. అంతేకాదు సినిమాల పై ఎవరికీ తోచినట్లుగా వారు రివ్యూలు వ్రాస్తున్న వెబ్ సైట్స్ మీద వెన్నెల కిషోర్ తో చెప్పించిన డైలాగ్ లో కూడ సెటైర్ కనిపిస్తుంది.


వాస్తవానికి ఫిలిం ఇండస్ట్రీలోనే కాదు ఏరంగంలో అయినా సక్సస్ ఉన్న వారికే క్రేజ్ ఉంటుంది వారికే భారీగా అడిగినంత పారితోషికాలు ఇస్తూ ఉంటారు. ఈవిషయాలు అన్నీ ఉన్నత చదువులు చదువుకున్న ఇంద్రగంటి మోహన్ కృష్ణకు తెలియనివి కావు. ప్రేక్షకుల అభిరుచి మారిన పరిస్థితులలో స్లోగా సినిమాను నడిపించే ఇంద్రగంటి మోహన్ కృష్ణ అనుసరించే టెక్నిక్ మార్చుకుంటే కాని సినిమాలు హిట్ అవ్వవు అని లేటెస్ట్ గా విడుదలైన ‘ఆ అమ్మాయి గురించి మీతో చెప్పాలి’ మూవీ ఫలితం ఇంద్రగంటికి తెలిసి వచ్చేల చేసింది అనుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: