హీరో ప్రభాస్ తన పెదనాన్న కృష్ణంరాజు మరణించడంతో షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చి తన పెదనాన్న కుటుంబ సభ్యులకు మానసికంగా ధైర్యాన్ని కలిగిస్తున్నాడు. ఈ పరిస్థితులలో కూడ ప్రభాస్ ను బాలీవుడ్ మీడియా టార్గెట్ చేస్తూ కొన్ని గాసిప్పులను తీసుకు వచ్చింది. గతంలో ప్రభాస్ అనుష్కల మధ్య ఎదో ఉంది అంటూ హడావిడి చేసిన మీడియా ఇప్పుడు తమ దృష్టి బాలీవుడ్ బ్యూటీ కీర్తి సనన్ పై పడింది.


ప్రస్తుతం ఆమె ప్రభాస్ తో ‘ఆదిపురుష్’ మూవీ లో సీతగా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో నటిస్తున్నప్పుడే ప్రభాస్ కృతి సనన్ ల మధ్య మంచి స్నేహం ఏర్పడిందని ఇప్పుడు వారిద్దరూ ఆ స్నేహ పరిధిని దాటి ఒకరి పై ఒకరు చాల ప్రేమతో సన్నిహితంగా ఉంటున్నారని బాలీవుడ్ మీడియా కథనాలు వ్రాస్తోంది అంటూ సోషల్ మీడియాలో గాసిప్పుల హడావిడి జరుగుతోంది.


కృతి సనన్ గతంలో అనేకమంది బాలీవుడ్ హీరోలతో డేటింగ్ చేస్తోంది అంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆవార్తలను కృతి ఖండించింది. ప్రస్తుతం ఆమె కెరియర్ బాలీవుడ్ లో టాప్ లో కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితులలో ఆమెను ప్రభాస్ తో లింక్ చేస్తూ బాలీవుడ్ మీడియా ఎందుకు గాసిప్పులు క్రియేట్ చేస్తోంది అంటూ చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఇది ఇలా ఉంటే ‘ఆదిపురుష్’ మూవీని జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా సుమారు 10 వేల ధియేటర్లలో విడుదల చేయడానికి భారీ స్కెచ్ వేస్తున్నారు.


ఇప్పటివరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎవరు చూడని త్రీడీ గ్రాఫిక్స్మూవీ ప్రత్యేకత అని అంటున్నారు. అంచనాల ప్రకారం ఈ మూవీ విజయవంతం అయితే కేవలం ఒక్క వారంలోని ఈ మూవీ 5వందల కోట్లు కలక్ట్ చేయడం చాల సులువు అన్న అంచనాలు కూడ వస్తున్నాయి. దీనితో ‘ఆదిపురుష్’ మూవీతో మూవీతో ప్రభాస్ పాన్ వరల్డ్ స్టార్ గా మారిపోవడం ఖాయం అంటున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: