తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకొవాల్సిన అవసరం లేదు.ఎన్నో లక్షల అభిమానులను సంపాదించుకొని నెంబర్ వన్ హీరో అయ్యాడు.ఇక ఆయన సినిమాలంటే కొనేందుకు డిస్ట్రీబ్యూటర్లు క్యూలు కడతారు. అదే విధంగా మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే సినిమా థియేటర్ల దగ్గర పరిస్థితి జాతర్లను తలపిస్తుంది. అయితే తాజాగా మెగాస్టార్‌కు డ్రిస్ట్రిబ్యూటర్లు భారీ షాకిస్తున్నారు.భారీ అంచనాలతో తీసిన చిరు సరికొత్త సినిమా గాడ్ ఫాదర్‌ను కొనుగోలు చేసేందుకు డిస్ట్రిబ్యూటర్లు ఎవరూ ఆసక్తి చూపడం లేదట. అయితే చిరంజీవి కెరీర్‌లో 'ఆచార్య' పెద్ద దెబ్బనే చెప్పుకొవాలి.


కొరటాల శివ దర్శకత్వంలో చిరు తెరకెక్కించిన 'ఆచార్య' సినిమా భారీ నెగిటివ్ టాక్ ఎదుర్కొంది. దానికి తోడుగా చిరంజీవి కొంతకాలంగా సరైన స్క్రిప్ట్‌లను కూడా ఎంచుకోవడం లేదని సినీ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.దీంతో ప్రస్తుతం చిరు హీరోగా రానున్న 'గాడ్ ఫాదర్' సినిమాను కొనుగోలు చేసేందుకు ఏ ఒక్క డిస్ట్రిబ్యూటర్ కూడా సినిమాను చెప్పిన మొత్తానికి కొనేందుకు ఆసక్తి చూపడం లేదని, విడుదలకు అతి కొద్ది వారాలే దూరంగా ఉండగా ఈ పరిణామం చిత్ర యూనిట్‌కు భారీ చేదు అనుభవం కానుందని వార్తలు వినిపిస్తున్నాయి.


అయితే నిర్మాతలు సినిమాను రూ.85 కోట్లకు అమ్మేందుకు రేట్ ఫిక్స్ చేశారు. కానీ డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం ఈ సినిమాకు అంత ఇచ్చేందుకకు సిద్ధంగా లేరని టాక్ నడుస్తోంది. అయితే మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో తన సినిమాను డిస్ట్రిబ్యూటర్స్ ఆసక్తి చూపకపోవడం ఇదే తొలిసారి కావడం విశేషం.ఒకప్పుడు చిరంజీవి అంటే అసలు సముద్రం అంత క్రేజ్ వున్న హీరో. బాలీవుడ్ హీరోలు సైతం చిరంజీవి క్రేజ్ చూసి భయపడిన రోజులు వున్నాయి. ఎన్ని ప్లాపులు వచ్చినా కూడా చిరంజీవి సినిమా అంటే చాలు డిస్ట్రిబ్యూటర్స్ అసలు ఏమాత్రం వెనక్కి తగ్గేవాళ్ళే కారు. ఒకవేళ తగ్గిన ఆయన ఫ్యాన్స్ మాత్రం రచ్చ రచ్చ చేసి చుక్కలు చూపించేవారు. అంతటి క్రేజ్ సంపాదించిన చిరంజీవికి ఇప్పుడు డిమాండ్ చాలా తగ్గిందనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: