టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఇంకా బన్నీ కాంబినేషన్ లో వచ్చిన 'పుష్ప' సినిమా మంచి సూపర్ హిట్ అయ్యింది. అందువల్ల రెండవ పార్ట్ పై అంచనాలు పెరిగాయి. అందుకే డైరెక్టర్ సుకుమార్ 'పుష్ప 2' సినిమాలో ఎవ్వరి ఊహకు అందని ట్విస్ట్ ను ప్లాన్ చేశారు. ఇది సినిమాకే హైలెట్ కానుంది. ఇప్పటికే ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అందుతుండగా తాజాగా విలన్స్ విషయంలో భారీ సస్పెన్స్ ను చూపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది.దీంతో పార్ట్ 2ను దర్శకుడు సుకుమార్ మరింత బ్రిలియెంట్ గా తెరకెక్కించేందుకు సిద్ధం అవుతున్నారు.టాలీవుడ్ దర్శకుల్లో కథలో సస్పెన్స్ ను చాలా బాగా హ్యాండిల్ చేయగల దర్శకుల్లో సుకుమార్ ఒకరు. ఆయన దర్శకత్వం ఇతరుల కన్నా పూర్తిగా భిన్నంగా ఉంటుంది. 'రంగస్థలం' నుంచి నెక్ట్స్ లెవల్లో సినిమాలను డైరెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం పుష్ప ది రూల్ పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో పుష్ప ది రూల్ లోని ఓ భారీ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.మొదటి భాగంలో విలన్స్ గా సునీల్, ఫాహద్ ఫాజిల్ ను చూపించిన విషయం తెలిసిందే. సునీల్ ను మధ్యలోనే తప్పించినా.. ఫాహద్ ఫాజిల్ తో పుష్ఫరాజ్ పోటీపడనున్నట్టు చూపించనున్నారు. దీంతో మెయిన్ విలన్ గా ఫాహద్ ఫాజిల్ ఉంటాడని అంతా కూడా భావిస్తున్నారు.


కానీ పుష్ప రాజ్ కు నమ్మిన బంటు 'కేశవ'ను విలన్ గా చూపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది.పార్ట్ 1 లో ఏమాత్రం అనుమానం రాకుండా కేశవ పాత్రను భయస్తుడిగా, కామిక్ గా నడిపించారు. కానీ కట్ చేస్తే సెకండ్ పార్ట్ లో విలన్ గా కనిపిస్తారని పలువురు సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. ఇప్పటి వరకు మూవీకి సంబంధించి వచ్చిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గూస్ బంప్స్ తెప్పిస్తుండగా ఈ ట్విస్ట్ తో దిమ్మతిరిగిపోనుందని అంటున్నారు.ఈసారి పార్ట్ 2 లో అల్లు అర్జున్ ను కాస్తా డిఫరెంట్ లుక్ లో చూపించనున్నారు. ఈసారి మరిన్ని పాత్రలు కూడా యాడ్ కానున్నాయి. ఈ సినిమాలో రష్మిక మందన్న రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. ఈ సెకండ్ పార్ట్ ని దాదాపు రూ.300 కోట్ల రూపాయలతో గ్రాండ్ గా నిర్మించనున్నారు.మరి ఈ సినిమా ఎలాంటి హిట్ కొడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: