గడచిన కొద్దిరోజుల క్రితం వరకు అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ గా పేరు పొందారు.కానీ పుష్ప సినిమాతో ఒక్కసారిగా ఐకాన్ స్టార్ గా మారిపోయారు. ఈ సినిమాతో పాన్ ఇండియన్ హీరోగా కూడా పేరుపొందారు. ఇక ఈ చిత్రాన్ని డైరెక్టర్ సుకుమార్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని చెప్పవచ్చు ఈ చిత్రంలో మునుపెన్నడూ లేనివిధంగా అల్లు అర్జున్ సరికొత్త లుక్ లో అందరిని ఆకట్టుకున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మీ క కూడా నటించింది కీలకమైన పాత్రలో అనసూయ, సునీల్, ఫహద్ ఫాజిల్ తదితరులు నటించారు.


ఇక పుష్ప సినిమా మంచి విజయం సాధించడంతో పుష్ప -2 సినిమా షూటింగ్ను త్వరలోనే ప్రారంభించనున్నారు ఈ చిత్రంలో చాలా ట్విస్టులు ఉంటాయని కూడా అభిమానుల భావిస్తున్నారు. ఇక పుష్ప సినిమా అయిపోయిన వెంటనే అల్లు అర్జున్ తర్వాత ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తారనే విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది. అయితే అల్లు అర్జున్ పుష్ప సినిమా కంటే ముందు డైరెక్టర్ వేణు శ్రీరామ్ తో ఒక సినిమాని కమిట్ అయ్యారు ఆ చిత్రమే ఐకాన్.


అయితే వేణు పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ సినిమాలో బిజీగా ఉండడం చేత ఇక అల్లు అర్జున్ కూడా పుష్ప సినిమాతో బిజీగా ఉండడం చేత ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. అయితే ఇప్పుడు పుష్ప -2 సినిమా తరువాత త్రివిక్రమ్ డైరెక్షన్లో సినిమా చేయబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి గతంలో వీరిద్దరి కాంబినేషన్లో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి అలా వైకుంటపురం వంటి సినిమాలు విడుదలయ్యాయి ఈ మూడు సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు మరొకసారి వీరిద్దరి కాంబినేషన్లో మరొక సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: