టాలీవుడ్ స్టార్ హీరో నటురల్ స్టార్ నాని  చివరిగా శ్యామ్ సింగరాయ్ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరో నాని ఇప్పుడు దసరా అనే సినిమా చేస్తున్నాడు.ఇకపోతే శ్రీకాంత్ ఓదెల అనే నూతన దర్శకుడు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా తెలంగాణలోని సింగరేణి గనుల నేపథ్యంలో సాగబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన కొన్ని లుక్స్ అలాగే పోస్టర్లు సినిమాలో నాని ఒక పూర్తి స్థాయి మాస్ లుక్ లో కనిపించబోతున్నాడని క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.

 ఇక ఈ సినిమా కోసం నాని పూర్తిస్థాయి తెలంగాణ మాండలికాన్ని కూడా నేర్చుకున్నట్లు తెలుస్తోంది.  ఈ సినిమా తర్వాత కూడా నాని ఒక కొత్త దర్శకుడితో సినిమా చేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇదిలావుంటే తాజాగా ఒక కొత్త దర్శకుడు చెప్పిన కథ నానికి బాగా నచ్చడంతో ఆయనకు నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది.కాగా  దర్శకుడు ఎవరనే విషయం మీద క్లారిటీ లేదు కానీ త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నారు.అయితే నాని సదరు దర్శకుడితో కాంబినేషన్లో సినిమా చేసేందుకు ఒక ప్రఖ్యాత ప్రొడక్షన్ హౌస్ కూడా సిద్ధమైందని హీరోయిన్ అలాగే

ఇతర నటీనటులను కూడా ఫైనలైజ్ చేసిన తర్వాత అధికారికంగా సినిమాను ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. కథ నచ్చడంతో పూర్తిస్థాయి బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేసుకుని రమ్మని దర్శకుడికి నాని చెప్పారని అంటున్నారు.కాగా  నాని ఒకపక్క హీరోగా నటిస్తూనే మరోపక్క నిర్మాతగా కూడా మారి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.ఇకపోతే గతంలో ఆయన చేసిన ఆ, హిట్ వంటి సినిమాలు మంచి హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ఇక ఇప్పుడు నాని నిర్మాణంలో హిట్ సినిమా రెండో భాగం రూపొందుతోంది. అయితే మొదటి భాగంలో విశ్వక్ సేన్ హీరోగా నటించగా రెండో భాగంలో మాత్రం అడవి శేషు హీరోగా నటిస్తున్నాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: