ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు.మొన్నటి వరకు టాలివుడ్ లో స్టార్ హీరోగా పేరుపొందిన ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరు పొందారు.RRR సినిమా పై ప్రశంసలు వర్షం కురిపిస్తూ కొంతమంది ప్రముఖుల సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉన్నారు. కానీ కొంతమంది ఇప్పటికీ ఎన్టీఆర్ ని ప్రశంసిస్తూ ఉన్నారు తాజాగా ఒక హీరోయిన్ కూడా అలాగే ఎన్టీఆర్ ని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేయడం జరిగింది. కానీ ఆ పోస్టు పొరపాటున ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. బాలీవుడ్ హీరోయిన్ అమీషా పటేల్ తెలుగులో పలు సినిమాలలో కూడా నటించింది.


మహేశ్, పవన్ కళ్యాణ్ , తదితర హీరోల సినిమాలలో కూడా నటించింది ఇక ఎన్టీఆర్ తో నరసింహుడు అనే చిత్రంలో నటించింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఎన్టీఆర్ గురించి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేయడం జరిగింది. ఎన్టీఆర్ తో కలిసి నటించిన నరసింహుడు సినిమాలోని ఒక పోస్టులతో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేయడం జరిగింది. ఎన్టీఆర్ ఇప్పుడు rrr  సినిమాతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.. అంతేకాకుండా లవ్లీ కో స్టార్, నిజాయితీ కల వ్యక్తి అంటే ఎన్టీఆర్ పై ప్రశంసలు కురిపించింది ఆమిషా పటేల్.


దీంతో ఈమె ట్వీట్  చేసేటప్పుడు ఎన్టీఆర్ పేరుకు బదులు వేరే ఫ్యాన్ ట్విట్టర్ అకౌంట్ ను ట్యాగ్ చేసింది. దీంతో నేటిజన్లు సైతం ఈమెను చూసుకోవాలి కదా అంటూ పోస్టులు చాలా వైరల్ గా చేస్తున్నారు...అయితే అది గమనించిన ఆమీషా పటేల్ మరొకసారి ట్యాగ్ ను జత చేసింది.. అది కూడా ఎన్టీఆర్ ది కాదు దాంతో మూడోసారి ట్విట్ చేస్తూ కేవలం ఎన్టీఆర్ పేరు లేకుండా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ గా మారు తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: