ప్రస్తుతం తమిళ సినిమా ఇండస్ట్రీ నుండి విడుదల కు రెడీగా ఉన్న మోస్ట్ క్రేజీ పాన్ ఇండియా మూవీ పొన్నియన్ సెల్వన్. ఈ మూవీ పై తమిళ సినీ ప్రేమికులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. అలాగే ఇప్పటి వరకు ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు , పాటలు ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై తమిళ ప్రేక్షకులతో పాటు భారతదేశం లోని ఇతర ప్రాంతాల ప్రేక్షకులు కూడా మంచి అంచనాలను పెట్టుకున్నారు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో చియాన్ విక్రమ్ , కార్తి , జయం రవి ,  ఐశ్వర్య రాయ్ ,  త్రిష లాంటి హేమాహేమీలు అయిన నటీనటులు నటిస్తూ ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మరింత అంచనాలు పెరిగిపోయాయి. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ మూవీ మొదటి భాగం సెప్టెంబర్ 30 వ తేదీన విడుదల కాబోతుంది. ఈ మూవీ విడుదల పడడంతో ఈ మూవీ యూనిట్ ఇప్పటికే తమిళనాడు లో అదిరి పోయే రేంజ్ లో ప్రమోషన్ లను నిర్వహిస్తూ వస్తుంది. ఇది ఇలా ఉంటే తమిళనాడు లో అదిరి పోయే రేంజ్ లో ప్రమోషన్ లను నిర్వహిస్తూ అక్కడి ప్రేక్షకుల్లో మరింతగా ఈ సినిమా పైన ఆసక్తిని పెంచుతున్నారు.

ఇది ఇలా ఉంటే తమిళనాడు మినహాయించి ఇతర ప్రాంతాలలో మాత్రం ఈ మూవీ యూనిట్ ప్రమోషన్ ల విషయంలో చాలా వరకు ఆసక్తిని చూపించడం లేదు. ఇప్పటి వరకు తమిళనాడు లో మినహాయిస్తే ఇతర ప్రాంతాలలో ఈ మూవీ యూనిట్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లను మరియు ఇతర పెద్ద పెద్ద ఈవెంట్ లను ఏమీ నిర్వహించలేదు. మరి రాబోయే రోజుల్లో అయినా ఈ మూవీ యూనిట్ ఇతర ప్రాంతాలలో కూడా భారీ ఎత్తున ప్రమోషన్ లను నిర్వహిస్తుందో లేదో చూడాలి. ఈ మూవీ కి మణిరత్నం దర్శకత్వం వహించగా , ఏ ఆర్ రెహమాన్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: