టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సర్కారు వారి పాట తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.అంతేకాదు ఈ సినిమా అనంతరం  వరుస సినిమాలు చేస్తూ బిజీగా వున్నాడు టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు.అయితే  ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ఈ సినిమా ఇటీవలే షూట్ మొదలు పెట్టారు.ఇకపోతే సెప్టెంబర్ 12న ఈ సినిమా హైదరాబాద్ లో స్టార్ట్ అవ్వగా విరామం లేకుండా షూటింగ్ చేస్తున్నట్టు తెలుస్తుంది.అయితే ఫస్ట్ షెడ్యూల్ మహేష్ బాబు పైనే చిత్రీకరిస్తున్నారు..

 భారీ యాక్షన్ సన్నివేశాలతో షూట్ స్టార్ట్ చేయగా ఒక నెల పాటు ఇదే యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించ బోతున్నారు.ఇక  దాదాపు 12 ఏళ్ల తర్వాత వీరి కలయికలో సినిమా రాబోతుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.అయితే ఇది ఇలా ఉండగా ఈ సినిమా నుండి తాజాగా మరొక వార్త బయటకు వచ్చింది.. ఈ సినిమాలో మరొక సీనియర్ హీరోయిన్ నటిస్తుందని టాక్ బయటకు వచ్చింది.. ఇక ఆమె మరెవరో కాదు రాజమాత శివగామి రమ్యకృష్ణ ఈ సినిమాలో కీలక రోల్ లో నటించ నుందని టాక్..అయితే  మహేష్ బాబుకు అత్త పాత్రలో ఈమె కనిపించ నుందని ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యింది.

ఇదిలావుంటే గతంలో మహేష్ బాబుతో ఒక సాంగ్ లో స్టెప్పులు వేసిన ఈ సీనియర్ హీరోయిన్ ఇప్పుడు ఈయన అత్త పాత్రలో ఎలా మెప్పిస్తుందో చూడాలి.. అంతేకాదు ఈ మూవీలో మహేష్ కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.. హారిక హాసిని బ్యానర్ పై రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.అయితే  ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఎలాగైతేనేం ఇక  అభిమానుల కోరిక తీరింది.. త్రివిక్రమ్ ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తామని ప్రకటించారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: