ప్రభాస్ హీరోగా నటించిన సినిమాలు వరుసగా భారీ స్థాయి లో రూపొందుతున్నాయి.
బాహుబలి సినిమా తర్వాత వరుసగా రెండు భారీ డిజాస్టర్స్ అందుకున్న
ప్రభాస్ ఒక్కసారి ఎలాగైనా భారీ విజయం అందుకోవాలని భావిస్తున్నాడు. అందులో భాగంగానే ఇప్పటికే
బాలీవుడ్ లో ఆయన పూర్తి చేసిన ఆదిపరుష్ చిత్రాన్ని విడుదల చేయడానికి రంగం సిద్ధం చేశాడు. ఈ
సినిమా త్వరలో విడుదల కాబోతూ ఉండగా రామాయణం ఆధారంగా రూపొందిన ఈ చిత్రంతో తప్పకుండా భారీ విజయం అందుకోవడం ఖాయం అని తెలుస్తుంది.
ఈ
సినిమా ద్వారా తప్పకుండా మంచి విజయాన్ని
ప్రభాస్ అందుకుంటాడు అని భావిస్తున్న నేపథ్యంలో ఈ చిత్రం ఎలా ఉంటుందో అని ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు. ఇకపోతే ఈ
సినిమా అలా పూర్తయిందో లేదో మరికొన్ని సినిమాలను కూడా మొదలుపెట్టి
ప్రభాస్ ఒక్కసారిగా అందరినీ ఎంతో ఆశ్చర్యపరిచాడు. ఆ క్రమంలోనే ఏకంగా నాలుగు సినిమాలను మొదలుపెట్టడం అభిమానులను ఎంతగానో ఆనందపరిచే విషయం అనే చెప్పాలి. వాటిలో అందరూ ఎంతగానో ఎదురు చూసే
సినిమా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సలార్ చిత్రం. ఇది ఎప్పుడు విడుదలవుతుందో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంటుంది.
భారీ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడైన
ప్రశాంత్ ప్రభాస్ తో
సినిమా చేస్తున్నాడు అనగానే అందరిలోనూ ఆ
సినిమా పట్ల ఎంతో ఆసక్తి కనబడింది. ఆ విధంగా
ప్రభాస్ ఈ
సినిమా ద్వారా తప్పకుండా
హాలీవుడ్ స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తారని గట్టి నమ్మకంతో ఉన్నాడు. చిత్ర బృందం కూడా అలాంటి
హాలీవుడ్ సినిమాను రూపొందిస్తుందట. త్వరలోనే ఈ
సినిమా యొక్క టీజర్ లో ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది అని చెబుతున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తుండగా చిత్రం ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి. ఇకపోతే ప్రాజెక్టు కే అని ఇప్పటికే మొదలుపెట్టిన
ప్రభాస్ స్పిరిట్ అనే చిత్రాన్ని కూడా తొందరలోనే ప్రారంభించబోతున్నారు.