మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పటికే ఈ సంవత్సరం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ మరియు కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కిన ఆచార్య మూవీ లలో నటించి ప్రేక్షకులను అలరించాడు . ఆర్ ఆర్ ఆర్ మూవీలో రామ్ చరణ్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా హీరోగా నటించాడు. ఆచార్య మూవీ లో మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో నటించాడు . 

ఇలా ఇప్పటికే ఈ సంవత్సరం రెండు మూవీ లతో ప్రేక్షకులను అలరించిన రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు . ఈ మూవీ లో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , ఎస్ ఎస్ తమన్మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు.  ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఈ మూవీ పాన్ ఇండియా మూవీ గా భారీ బడ్జెట్ తో  తేరక్కెక్కుతున్నట్లు తెలుస్తోంది.

మూవీ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో ముగ్గురు దర్శకులను లైన్ లో పెట్టి ఉన్నట్లు తెలుస్తోంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ తర్వాత రామ్ చరణ్ ,   నర్తన్ దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో నటించ బోతున్నట్లు తెలుస్తోంది. ఆ మూవీ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఒక మూవీ లో నటించ బోతున్నట్లు తెలుస్తుంది. ఆ తర్వాత లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కబోయే  మూవీ లో రామ్ చరణ్ నటించిన బోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా రామ్ చరణ్ తన తదుపరి మూవీ లకు అదిరిపోయే రేంజ్ లైనప్ ని సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: