యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లలో హీరోగా నటించి తనకంటూ ఒక అద్భుతమైన క్రేజ్ ని తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ మరి కొన్ని రోజుల్లో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో హీరోగా నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో 30 వ మోవీగా తెరకెక్కకబోతుంది.

ఇది వరకే జూనియర్ ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ మూవీ తెరకెక్కిన విషయం మన అందరికీ తెలిసిందే.  ఆ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోయే రెండవ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఆ అంచనాలకు తగినట్టుగానే ఈ మూవీ ని పాన్ ఇండియా స్థాయికి మించి తెరకెక్కించాలని దర్శకుడు కొరటాల శివ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఈ సినిమా షూటింగ్ కూడా కాస్త డిలే అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కోసం జూనియర్ ఎన్టీఆర్ కూడా కాస్త బరువు తగ్గి అదిరిపోయే స్లిమ్ లుక్ లోకి రాబోతున్నట్లు సమాచారం.

ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ లో ఎన్టీఆర్ సరసన పలానా హీరోయిన్ కనిపించబోతుంది అంటూ అనేక ముద్దుగుమ్మల పేర్లు తెరపైకి వచ్చిన విషయం మనకు తెలిసింది. కాకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మొదటగా ఈ మూవీ లో ఎన్టీఆర్ సరసన మూవీ యూనిట్ గా హీరోయిన్ గా కీయారా అద్వానీ ని అనుకున్నట్లు ,  కాకపోతే ఈ ముద్దుగుమ్మ ఇతర మూవీ లతో బిజీగా ఉండడం వల్ల ఈ మూవీ లో నటించలేకపోయినట్లు తెలుస్తోంది.  తర్వాత రెండవ ఆప్షన్ గా రష్మిక మందన ను తీసుకోవాలని మూవీ యూనిట్ ఆలోచనలు ఉన్నట్లు కూడా ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త ఎంతవ రకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: