టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇటీవలే తన తదుపరి సినిమా ను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఏకంగా రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వరుణ్ కి అవి నిరాశనే మిగిల్చాయి అని చెప్పాలి. ముందుగా రిలీజ్ చేసిన గని చిత్రం, ఆ తర్వాత వచ్చిన ఎఫ్ 3 రెండు చిత్రాలు కూడా ప్రేక్షకులను నిరుత్సాహపరిచినప్పటికీ ఈ హీరో క్రేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదని చెప్పాలి. కారణం ఏదైనా ఈ హీరో సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఎదురుచూశారు. అయితే ఇంకా ఈ హీరో సినిమా అనౌన్స్ కాకపోవడం అందరు నిరాశపడినట్లు అయ్యింది.

ఈ నేపథ్యంలోనే ఆయన యాక్షన్ స్టార్ ఇమేజ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడని అందుకే తదుపరి సినిమా ను ఒకే చేయడంలో ఇంత ఆలస్యం చేస్తున్నాడని చెప్పవచ్చు.  ఆ ప్రయత్నంలో భాగంగానే గని సినిమా చేయగా అది పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు తాజాగా ఓ కొత్త సినిమాను ఒకే చేయడం విశేషం. ఈ నేపథ్యంలో ఆయన నెక్స్ట్ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. ఫస్టు పోస్టర్ ను కూడా వదిలారు.  ఇది అందరిని ఆకట్టుకునేలా ఉండడం విశేషం. వరుణ్ తేజ్ తాజా చిత్రం వైమానికదళం నేపథ్యంలో నడుస్తుందనే విషయం ఈ పోస్టర్ వలన అర్థమవుతోంది.

చాలారోజులుగా ఈ హీరో అభిమానులు ఎదురుచూస్తున్న అనౌన్సమెంట్ ఇప్పుడు రావడం నిజంగా అందరిని ఆనందపరుస్తుంది.  ఈ సినిమాలో ఆయన యుద్ధ విమానం పైలట్ గా కనిపిస్తాడనే విషయం స్పష్టమవుతోంది. కెరియర్ పరంగా వరుణ్ కి ఇది 13వ సినిమా. సందీప్ ముద్ద నిర్మిస్తున్న ఈ సినిమాకి శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగులో ఆయనకి ఇదే మొదటి సినిమా. మరి ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేస్తున్న నేపథ్యంలో ఇది ఎలా ఉంటుందో తెలియాల్సి ఉండి. త్వరలోనే ఈ సినిమా యొక్క షూటింగ్ మొదలు కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: