డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన ఇప్పటికే. ఎన్నో విజయవంతమైన మూవీలకు దర్శకత్వం వహించిన పూరి జగన్నాథ్ ఇప్పటికి కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న దర్శకుడిగా కెరియర్ కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా పూరి జగన్నాథ్ , విజయ్ దేవరకొండ హీరోగా అనన్య పాండే హీరోయిన్ గా లిగర్ అనే బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన మూవీ కి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే.

మూవీ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కింది. ఆగస్టు 25 వ తేదీన తెలుగు తో పాటు హిందీ , కన్నడ ,  మలయాళం , తమిళ భాషల్లో విడుదల అయిన లైగర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను తీవ్ర నిరుత్సాహపరిచింది. దానితో లైగర్ మూవీ చివరకు బాక్స్ ఆఫీస్ దగ్గర ప్లాప్ గా మిగిలింది. ఇది ఇలా ఉంటే గతంలో పూరి జగన్నాథ్ , విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో జన గణ మన అనే మూవీ ని అనౌన్స్ చేశారు. ఈ సినిమా కూడా ఆగిపోయింది. దానితో పూరి జగన్నాథ్ తన తదుపరి మూవీ ని బాలకృష్ణ హీరోగా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే పూరి జగన్నాథ్ , బాలకృష్ణ కాంబినేషన్ లో పైసా వసూల్ అనే మూవీ తెరకెక్కింది. ఈ మూవీలో బాలకృష్ణ అదిరిపోయే డైలాగ్ లు ,  మాస్ ఫైట్ లు ప్రేక్షకులను ఎంత గానో అలరించాయి. అలాగే ఈ సినిమా కూడా ప్రేక్షకులను బాగానే అలరించింది. ఇలా పైసా వసూల్ మూవీ తో ప్రేక్షకులను ఎంత గానో అలరించిన ఈ కాంబినేషన్ లో మరో మూవీ తెరకెక్కబోతునట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వైర ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: