రవితేజ లైన్‌లో పెట్టిన చిత్రాల్లో పాన్ ఇండియా ప్రాజెక్టు టైగర్ నాగేశ్వర్ రావు (Tiger Nageswara Rao) కూడా ఒకటి. ఈ సినిమాతో అలనాటి హీరోయిన్ తెలుగు స్క్రీన్ పై మళ్లీ మెరువబోతుందట.


ఇంతకీ ఆ నటి ఎవరనేది ఊహించే ఉంటారు.

క్రాక్ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టడంతో ఫుల్ జోష్ మీదున్న రవితేజ (Ravi Teja) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. రవితేజ లైన్‌లో పెట్టిన చిత్రాల్లో పాన్ ఇండియా ప్రాజెక్టు టైగర్ నాగేశ్వర్ రావు (Tiger Nageswara Rao) కూడా ఒకటి. ఈ సినిమాతో అలనాటి హీరోయిన్ తెలుగు స్క్రీన్ పై మళ్లీ మెరువబోతుందట.. ఇంతకీ ఆ నటి ఎవరనేది ఊహించే ఉంటారు..జానీ, బద్రీ సినిమాలతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న రేణూదేశాయ్‌.


 రవితేజ చిత్రంలో రేణూదేశాయ్ (Renu Desai) రీఎంట్రీ ఇవ్వబోతుందని, ఈ సినిమాలో కీ రోల్ చేస్తుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై అఫీషియల్ అప్‌డేట్ ఇస్తూ ఈ విషయాన్ని అందరి తో షేర్ చేసుకున్నారు రేణూ దేశాయ్‌. నన్ను నమ్మి ఎంతో స్ఫూర్తివంతమైన హేమలత లవణం గారి పాత్ర ఇచ్చినందుకు వంశీకృష్ణ నేనెప్పుడూ కృతజ్ఞురాలినై ఉంటా..అంటూ స్క్రిప్ట్‌లో తన సీన్లకు సంబంధించిన స్క్రీన్ షాట్‌ ను అందరి తో పంచుకున్నారు రేణూ దేశాయ్‌.


ఈ చిత్రంతో బాలీవుడ్ భామ కృతిసనన్ సోదరి నుపుర్ సనన్ తెలుగు ప్రేక్షకుల కు పరిచయమవుతోందట.. గాయత్రి భరద్వాజ్ మరో ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ డైరెక్టర్‌. రవితేజ మరోవైపు సుధీర్ వర్మ దర్శకత్వం లో రావణాసుర చిత్రంలో నటిస్తున్నాడట.. దీంతోపాటు బాబీ డైరెక్షన్‌లో చిరంజీవి నటిస్తోన్న 154వ చిత్రం లో కీ రోల్ చేస్తున్నాడట రవితేజ.



మరింత సమాచారం తెలుసుకోండి: