మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే. వీరి స్నేహబంధం గురించి ఇండస్ట్రీలో అందరి కీ కూడా తెలుసు. వీరిద్దరూ కలిసి వ్యాపారా లు కూడా చేశారు.


అలాంటి స్నేహితులు ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద పోటీ కి సిద్ధపడుతున్నారు. దసరా కానుకగా వీరు నటించిన సినిమాలు 'గాడ్ ఫాదర్', 'ది ఘోస్ట్' తలపడబోతున్నాయి. ఈ రెండు సినిమాలు అక్టోబర్ 5నే ప్రేక్షకుల ముందుకు రానున్నాయట.. మధ్యలో ఈ సినిమా ల మధ్య క్లాష్ లేకుండా.. రిలీజ్ డేట్లు మారుతున్నట్లు ప్రచారం జరిగిందట.


 


కానీ అందులో నిజం అయితే లేదని తేలిపోయింది. ఇరు చిత్రాల దర్శకనిర్మాతలు అక్టోబర్ 5న తమ సినిమాలు రిలీజ్ అవుతాయని వెల్లడించారు. అయితే గత రెండు దశాబ్దాల్లో చిరు, నాగార్జున పోటీ పడింది లేదు. ఇప్పుడు ఇద్దరూ తలపడుతుండడంతో ఇబ్బందికర వాతావరణం నెలకొంటుందా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఈ క్లాష్ ను ఇద్దరు హీరోలు ప్రొఫెషనల్ గానే చూస్తున్నట్లున్నారని తెలుస్తుంది.. చిరంజీవి ఇంకా 'గాడ్ ఫాదర్' ప్రమోషన్స్ అయితే మొదలుపెట్టలేదు కానీ..


 


నాగార్జున 'ది ఘోస్ట్' ప్రమోషన్స్ మాత్రం షురూ చేశారు. ఈ క్రమంలో మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్నారు. చిరంజీవితో క్లాష్ గురించి మాట్లాడారాయన. చిరంజీవిని చాలా మంది ఇష్టపడతార ని.. రెండు సినిమాల రిలీజ్ కోసం ఆతురతగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. దసరా సమయంలో రెండు, మూడు సినిమాలు రిలీజ్ కావడమనేది గత నలభై ఏళ్లుగా జరుగుతోందని.. సినిమా బాగుంటే ఎన్ని విడుదలైనా ప్రేక్షకులు ఆదరిస్తారని అన్నారు నాగార్జున. మరి ఈ రెండు సినిమా లు ఏ రేంజ్ లో సక్సెస్ అవుతాయో చూడాలి మరి. టీజర్ మరియు ఫస్ట్ లుక్ బట్టి చూస్తే రెండు సినిమాలకు కూడా మంచి టాక్ అయితే వచ్చింది. కానీ నాగార్జున మూవీ కి కొద్దిగా ఆసక్తి తగ్గిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: