బాలీవుడ్ సీనియర్ దర్శకుడు ప్రకాష్ ఝా గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేకపోయినా కూడా బాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రం బాగా సుపరిచితమైన వ్యక్తి


అపహరన్, సత్యాగ్రహ, మృత్యుదంద్, రాజ్ నీతి వంటి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న 30 సినిమాలకు దర్శకత్వం వహించాడట.. అంతే కాకుండా ఆశ్రం అనే వెబ్ సిరిస్ ద్వారా కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక ఇటీవల ఈయన దర్శకత్వం వహించిన' మత్తో కీ సైకిల్' అనే సినిమా  సెప్టెంబర్ 16 వ తేదీన విడుదల అయ్యింది.


సినిమా విడుదలైన మొదటి రోజు నుండి థియేటర్ల వద్ద మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ప్రకాష్ ఝా ప్రధాన పాత్రలో నటించారట.. ఈ సినిమా మొత్తం ఒక సైకిల్ చుట్టూ తిరుగుతుంది. ఇక శుక్రవారం ఈ సినిమా విడుదలైన సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రకాష్ ఝా బాలీవుడ్ హీరోల గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడట. ఈ సమావేశంలో ఒక విలేకరి మాట్లాడుతూ మీరు పెద్ద హీరోలతో సినిమాలు తీయకపోతే కారణమేమిటి?


 


అని ప్రశ్నించగా.. ప్రకాష్ ఝా స్పందిస్తూ… బాలీవుడ్ బడా హీరోలు అందరూ పాన్ మసాలా యాడ్స్ చేయడంతో బిజీగా ఉన్నారు. ఆ పాన్ మసాలా వల్ల ప్రజలకు ఎంత హానికరం వారికి అవసరం లేదు. ఒక్కరోజు యాడ్ షూటింగ్ కోసం రూ.50 కోట్లు వస్తుంటే వాళ్ళు సినిమాలు ఎందుకు చేస్తారు అంటూ సమాధానం కూడా ఇచ్చాడు. మిగతా ఇండస్ట్రీలో వందల కోట్లు పెట్టి పాన్ ఇండియా సినిమాలో నిర్మిస్తుంటే బాలీవుడ్ హీరోలు మాత్రం పాన్ మసాలా యాడ్స్ చేస్తూ బిజీగా ఉన్నారు.


ఇక వారికి కథ వినే సమయం ఉండదు అందుకే బాలీవుడ్ ఇండస్ట్రీ నుండి కంటెంట్ ఉన్న సినిమాలు కూడా రావటం లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడట.బాలీవుడ్ హీరోల గురించి ప్రకాష్ ఝా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వ్యాఖ్యల గురించి బాలీవుడ్ స్టార్ హీరోలు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: