ఇంత వరకూ బాగా నే ఉంది మధ్యలో త్రిష ఎందు కొచ్చిందని అనుకుంటున్నారా? టెక్నాలజీ సాయం తో ఓ నెటిజన్.. ప్రకాశ్రాజ్ భార్యగా కనిపించిన ఆ నటి ఫొటో ను తీసేసి ఆ స్థానం లో త్రిష ఫొటో ని ఉంచాడు. ప్రకాశ్రాజ్ బాధపడేది త్రిష కోసమే అనిపించే లా మాయ చేశాడు. ఆ ఫన్నీ వీడియో నెట్టింట అటూ ఇటూ చక్కర్లు కొట్టి, చివర కు ప్రకాశ్రాజ్ ను చేరింది. ఆయన ఆ వీడియో ను తన సోషల్ మీడియా లో ఉంచాడు .. ''ఈ ఎడిటింగ్ చేసిందెవరో తెలియదు గాని దీన్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది'' అని పేర్కొన్నారు. దీనిపై త్రిష స్పందిస్తూ నవ్వుల ఎమోజీ పెట్టారు. దాంతో, ఆ వీడియో వైరల్ అవుతోంది.
ధనుష్ హీరోగా తెరకెక్కిన 'తిరు' అనే సినిమా లో ప్రకాశ్రాజ్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రం లోని ఓ భావోద్వేగ సన్నివేశాన్నే సదరు నెటిజన్ ఎడిట్ చేసి, 'ఘిల్లి' చిత్రం లోని సన్నివేశాల ను అతికించాడు. విజయ్ హీరోగా 2004 లో వచ్చిన చిత్రమిది. తెలుగులో మహేశ్బాబు నటించిన 'ఒక్కడు'కు రీమేక్. ఇక్కడ భూమిక కథానాయికగా నటించగా అక్కడ త్రిష నటించారు. నాయికా ప్రతినాయకులుగా, తండ్రీ కూతుళ్లు గా.. ఇలా ఎలా కనిపించినా ప్రకాశ్రాజ్- త్రిష కాంబినేషన్ ను ఇటు తెలుగు ప్రేక్షకులు, అటు తమిళ ప్రేక్షకులు ఆదరించారు. వీరిద్దరు కీలక పాత్రలు పోషించిన 'పొన్నియిన్ సెల్వన్ 1' ఈ నెల 30న విడుదల కానుంది. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ సినిమా లో విక్రమ్, ఐశ్వర్యరాయ్, జయం రవి…ఇంకా తదితరులు ఉన్నారు.