మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస మూవీ లలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం చిరంజీవి , మోహన్ రాజా దర్శకత్వం లో తెరకెక్కిన గాడ్ ఫాదర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ ఈ సంవత్సరం అక్టోబర్ 5 వ తేదీన విడుదల కాబోతోంది. ఈ మూవీ తో పాటు మెహర్ రమేష్ దర్శకత్వంలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా తెరకెక్కుతున్న భోళా శంకర్ అనే మూవీ లో కూడా చిరంజీవి హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో చిరంజీవి కి చెల్లెలు పాత్రలో కీర్తి సురేష్ కనిపించబోతుంది.

ఈ రెండు మూవీ లతో పాటు బాబి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఒక మూవీ లో కూడా చిరంజీవి హీరోగా నటిస్తూ వస్తున్నాడు. ఈ మూవీ ని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇలా వరుస మూవీ లతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు అయినటు వంటి వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక మూవీ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఎందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా చాలా రోజుల క్రితమే విడుదల అయ్యింది.

ఇది ఇలా ఉంటే వెంకీ కుడుముల , చిరంజీవి ప్రాజెక్ట్ ఆగిపోయింది , అంటూ ఆ మధ్య కొన్ని వార్తలు బయటికి వచ్చాయి. కాక పోతే ఆ వార్తలు అన్ని అవాస్తవం అని ఆ తర్వాత మళ్లీ కొన్ని వార్తలు వచ్చాయి. ఇది ఇలా ఉంటే వెంకీ కుడుముల తాజాగా మెగాస్టార్ చిరంజీవి కి పూర్తి కథను వినిపించగా చిరంజీవి ఆ కథకు పెద్దగా సంతృప్తి చెందకపోవడంతో వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఆగిపోయింది అంటూ మళ్ళీ వార్తలు వస్తున్నాయి. మరి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందా ...  లేదా ...  అనే దానిపై ప్రస్తుతం స్పష్టత లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: