తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సౌందర్య గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆనాటి కాలంలో సావిత్రి తర్వాత అంత గుర్తింపుని తెచ్చుకున్న నటీమణి ఎవరైనా ఉన్నారు అంటే..

అది కేవలం సౌందర్య మాత్రమే.. కానీ ఈమె మరణించి.. ఆమె స్థానాన్ని ఎవరు భర్తీ చేయకుండా చేసి వెళ్లిపోయారు. చూడడానికి పక్కింటి అమ్మాయిలా..తెలుగింటి ఆడపడుచులా కనిపించే సౌందర్యకు తెలుగు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారని చెప్పాలి. సౌందర్య నటించిన ఏ సినిమా అయినా సరే మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుంది అంటే ఈమెకున్న ప్రేక్షకాదరణ ఎట్టిదో చెప్పవచ్చు. ఇదిలా ఉండగా గ్లామర్ ప్రపంచంలో స్కిన్ షో చేస్తేనే అవకాశం ఉంటుంది అని తెలిసినప్పటికీ.. అలాంటి సందర్భంలో కూడా గ్లామర్ షో తో పని లేకుండా తన నటనతో స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంది.

ఇకపోతే పోటీ ప్రపంచంలో అందరూ గ్లామర్ గా ఉండాలని కోరుకునే సందర్భంలో కూడా కట్టుబొట్టు, సాంప్రదాయంగా .. తన ప్రతిభ తో తనను తాను నిరూపించుకున్న సౌందర్య ఎందుకు సినిమాలలో ఎక్స్పోజింగ్ కి దూరంగా ఉంది అనే విషయం తన స్నేహితురాలు ప్రముఖ హీరోయిన్ ఆమనీ కు తెలియజేసినట్లు సమాచారం. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె ఎన్నో విషయాలను షేర్ చేసుకోవడంతో పాటు సౌందర్య ఎక్స్పోజింగ్ కి ఎందుకు దూరం అయింది అనే విషయాన్ని కూడా వెల్లడించింది. ఒకానొక సందర్భంలో సౌందర్య ఆమనితో మాట్లాడుతూ.. అసలే గ్లామర్ ప్రపంచం.. స్కిన్ షో చేస్తే తప్ప ప్రేక్షకులు ఆదరించని పరిస్థితుల్లో నువ్వెందుకు గ్లామర్ షో కి దూరంగా ఉంటున్నావు అని అడగిందట.

అప్పుడు సౌందర్య అందుకు సమాధానంగా..' వివాహం జరిగిన తర్వాత భర్త, పిల్లలతో కలిసి నా సినిమాలు నేను చూసేటప్పుడు నేను సాంప్రదాయంగా లేకపోతే ఒకవైపు నా భర్త, మరొకవైపు పిల్లలు నన్ను అసహ్యించుకునే అవకాశం ఉంటుంది. అందుకే నేను గ్లామర్ షో కి దూరంగా ఉంటాను అని చెప్పిందట. ఇక భవిష్యత్తు గురించి చక్కగా ఆలోచించి స్కిన్ షో చేయకుండానే తనను తాను తన ప్రతిభను నిరూపించుకొని ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది . ఇప్పటికీ కూడా ఈమె నటించిన సినిమాలు బుల్లితెరపై ప్రసారమయ్యాయి అంటే మంచి టిఆర్పి రేటింగ్ సొంతం చేసుకుంటాయని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: