సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సంవత్సరం సర్కారు వారి పాట మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి గీత గోవింద మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన విజయాన్ని అందుకొని ఫుల్ క్రేజ్ ని సంపాదించుకున్న పరుశురామ్ దర్శకత్వం వహించగా , కీర్తి సురేష్మూవీ లో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన హీరోయిన్ గా నటించింది. సముద్ర ఖనిమూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించగా , తమన్మూవీ కి సంగీతాన్ని అందించాడు.

భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకొని బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించిన ఈ సినిమా కొంత కాలం నుండి 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ కి 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో కూడా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇలా థియేటర్ మరియు 'ఓ టి టి'  ప్రేక్షకులను ఎంత గానో అలరించిన సర్కారు వారి పాట సినిమా మరి కొన్ని రోజుల్లో బుల్లి తెర ప్రేక్షకులను కూడా అలరించడానికి రెడీ అయ్యింది.

ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా తాజాగా వెలువబడింది. ప్రముఖ ఛానల్ స్టార్ మా టెలివిజన్ ప్రీమియర్ లో వచ్చే ఆదివారం అంటే.. సెప్టెంబర్ 25, 2022 న సాయంత్రం 6 గంటలకు సర్కారు వారి పాట మూవీ ప్రసారం కానుంది. ఈ విషయాన్ని తాజాగా స్టార్ మా చానల్ అధికారికంగా ప్రకటించింది. మరి ఇప్పటికే థియేటర్ మరియు 'ఓ టి టి'  ప్రేక్షకులను ఎంత గానో అలరించిన సర్కారు వారి పాట మూవీ బుల్లి తెర ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: