టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ప్రేక్షకులలో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. ఇటీవల ఆయన నటించి  పుష్ప ది రైజ్ తో పాన్ ఇండియా హీరోగా గుర్తింపును సొంతం చేసుకున్న అల్లు అర్జున్ తర్వాత సినిమాలు కూడా సక్సెస్ సాధించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.అయితే బన్నీ తర్వాత ప్రాజెక్ట్ కు సంబంధించి చాలామంది డైరెక్టర్ల పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. ముఖ్యంగా  త్రివిక్రమ్ శ్రీనివాస్, బోయపాటి శ్రీను పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.అయితే దసరా పండుగ కానుకగా బన్నీ కొత్త సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది. 

బన్నీ తర్వాత మూవీ డైరెక్టర్ గురించి క్లారిటీ లేకపోయినా ఈ సినిమాలో హీరోయిన్ మాత్రం ఫిక్స్ అయిందని తెలుస్తోంది.ఇదిలావుంటే  ప్రస్తుతం చరణ్ శంకర్ కాంబినేషన్ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్న కియారా అద్వానీ ఈ సినిమాలో నటిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.అంతేకాకుండా  కియారా అద్వానీ ఇతర బాలీవుడ్ హీరోయిన్లతో పోల్చి చూస్తే తక్కువ రెమ్యునరేషన్ కు సినిమాలు చేయడానికి అంగీకరిస్తున్నారు.అయితే ఈ కారణం వల్లే ఆమెకు సినిమా ఆఫర్లు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదని తెలుస్తోంది. ఇక కియారా అద్వానీకి సౌత్ లో మరికొన్ని ఆఫర్లు వస్తున్నా ప్రాజెక్ట్ ల ఎంపికలో కియారా అద్వానీ ఆచితూచి వ్యవహరిస్తున్నారని సమాచారం అందుతోంది.

 కియారాపారితోషికం 5 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉందని తెలుస్తోంది. అయితే సౌత్ హీరోలకు జోడీగా నటించి ఆ సినిమాలతో సక్సెస్ సాధిస్తే కియారా అద్వానీ కెరీర్ మరింత పుంజుకునే ఛాన్స్ అయితే ఉంది.కియారా అటు గ్లామర్ రోల్స్ లోనూ ఇటు అభినయ ప్రధాన పాత్రల్లోనూ అద్భుతంగా నటించగలరు. ఇక ఈ కారణం వల్లే కియారా అద్వానీకి ఆఫర్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోందని తెలుస్తోంది. అయితే బన్నీ ఒక్కో సినిమాకు 60 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటుండగా బన్నీకి ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం..!!

మరింత సమాచారం తెలుసుకోండి: