టాలెంటెడ్ డైరెక్టర్ మణిరత్నం గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు.. ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించి స్టార్ డైరెక్టర్గా కూడా గుర్తింపు పొందారు.అయితే చాలాకాలం తర్వాత తాజాగా భారీ బడ్జెట్ తో ఒక విజువల్ వండర్ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో  తెరకెక్కించడం జరిగింది.ఆ చిత్రమే పొన్నీయన్ సెల్వన్. ఈ చిత్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించడం జరిగింది. ఇందులో ఐశ్వర్యారాయ్, కార్తీ, విక్రమ్, త్రిష, సముద్రఖని జయం రవి తదితరులు నటిస్తూ ఉన్నారు.


ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్ ప్రేక్షకులను సైతం బాగా ఆకట్టుకున్నది. దీంతో ఈ సినిమా కోసం అభిమానుల సైతం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. డైరెక్టర్ మణిరత్నం కెరియర్ లోనే ఈ సినిమా అత్యధిక బడ్జెట్ తో తెరెకేక్కించడం జరిగింది. ఈ చిత్రం ఈనెల 30వ తేదీన పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ క్రమంలోనే  చిత్రం బృందం ప్రమోషన్ పనులను చాలా వేగంగా చేస్తోంది. ఇక నిన్నటి రోజున చెన్నైలో విలేకరుల సమావేశం కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో డైరెక్టర్ మణిరత్నం ఈ సినిమా గురించి పలు విషయాలను తెలియజేశారు.


పొన్నియన్ సెల్వన్ సినిమాలో నందిని పాత్ర కోసం ఏ హీరోయిన్ అయినా సంప్రదించారా.. అనే ప్రశ్న ఎదురవ్వగా ?.. అందుకు మనిరత్నం అవును అనే సమాధానం తెలిపారు. ముందుగా ఈ సినిమాలోని నందిని పాత్ర కోసం అలనాటి స్టార్ హీరోయిన్ రేఖను సంప్రదించానని కానీ కొన్ని కారణాల వల్ల ఐశ్వర్యరాయ్  ఈ పాత్రకి తీసుకోవడం జరిగింది అని తెలియజేశారు మణిరత్నం. ఈ చిత్రంలో ఐశ్వర్య లుక్ చూసిన అభిమానుల సైతం చాలా ఆనంద పడుతున్నారని తెలియజేశారు. చాలాకాలం తర్వాత ఐశ్వర్యరాయ్ నటించబోతోంది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పిస్తుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: