తాజాగా హీరో శింబు నటించిన ముత్తు చిత్రంతో మళ్లీ వార్తల్లో నిలిచాడు తమిళ డైరెక్టర్ గౌతమ్ మినన్. ఇటీవలే గౌతమ్ మీనన్ నటుడుగా కూడా పలు సినిమాలలో నటిస్తూ ఉన్నారు. ఇక గతంలో కూడా తెలుగు లో ఏమాయ చేసావే తదితర సినిమాలతో మంచి ప్రేక్షకుల ఆదరణ పొందారు.. ఆ తర్వాత ఎన్నో సినిమాలను డైరెక్షన్ చేశారు గౌతమ్ మీనన్. అయితే తాజాగా ఈ డైరెక్టర్ గురించి ఒక విషయం చాలా వైరల్ గా మారుతోంది. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.



కోలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా పేరుపొందారు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. తాజాగా విక్రమ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు ఈ డైరెక్టర్. ఇక ఈ సినిమా అయిపోయిన వెంటనే హీరో విజయ్ దళపతితో 67వ సినిమాలను తెరకెక్కించబోతున్నారు. ఇక ఈ చిత్రం లో విలన్ గా నటించేందుకు డైరెక్టర్ గౌతమ్ మీనన్ ను సంప్రదించినట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి కేజీఎఫ్ విలన్ సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నారని ఇప్పటికే పలు వార్తలు కూడా వినిపించాయి. మరి సంజయ్ దత్ గౌతమ్ మినన్ ఇద్దరు ఈ సినిమాలో భాగమవుతారా లేకుంటే ఈ చిత్రంలో కేవలం ఒకే విలన్ నటిస్తున్నారా అనే విషయం మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.



ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి అందుకు సంబంధించిన అన్ని అప్డేట్లు కూడా రాబోయే రెండు నెలలో బయటికి వస్తాయని ఇటీవల డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తెలియజేశారు. డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ మధ్యకాలంలో తరచూ సినిమాలలో నటిస్తూ ఉన్నారు. ముఖ్యంగా నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముంబై నేపథ్యంలో జరిగే ఒక గ్యాంగ్ స్టార్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా కుండబోతోందని సమాచారం. కే జి ఎఫ్ సినిమాని మించి విజువల్ తో ఈ సినిమాని తెరకెక్కించేందుకు బిగ్ ప్లాన్ వేసినట్లుగా సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: