తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లలో నటించి ఇప్పటికీ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్న మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చాలా సంవత్సరాలు పాటు రాజకీయాలపై దృష్టి పెట్టి మూవీ లకు దూరంగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150' మూవీ తో తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత నుండి మెగాస్టార్ చిరంజీవి వరస మూవీ లలో నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పటికే ఈ సంవత్సరం చిరంజీవి 'ఆచార్య' మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు.

మెగాస్టార్ చిరంజీవి తాజాగా గాడ్ ఫాదర్ అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ కి మోహన్ రాజా దర్శకత్వం వహించగా ,  ఈ మూవీ లో సల్మాన్ ఖాన్  ,  సత్యదేవ్ నయనతార కీలక పాత్రలలో నటించారు. తమన్మూవీ కి సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ ని అక్టోబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ ట్రైలర్ ని సెప్టెంబర్ 25 వ తేదీన విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు అయినటు వంటి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేయునున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ నుండి కొన్ని ప్రచార చిత్రాలను మూవీ యూనిట్ విడుదల చేయగా అవి ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. దానితో ఈ మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: