టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరు అయిన అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకం గా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అఖిల్ , వి వి వినాయక్ దర్శకత్వం లో తెరకెక్కి న అఖిల్ మూవీ తో హీరో గా ఎంట్రీ ఇచ్చాడు. అఖిల్ ఆ తర్వాత హలో ,  మిస్టర్ మజ్ను మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి మూవీ లలో హీరోగా నటించాడు. అఖిల్ ఆఖరుగా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ తో బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అఖిల్ టాలీవుడ్ స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఏజెంట్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో సాక్షి వైద్య , అఖిల్ సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ,  హిప్ హప్ తమిజా ఈ మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు.

మమ్ముట్టి ఈ మూవీ లో కీలక పాత్రలో కనిపించ బోతున్నడు. ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ ని పాన్ ఇండియా మూవీబిగా విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తి అయ్యింది. ఇది ఇలా ఉంటే అఖిల్ కు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ ప్రస్తుతం నేటింటా వైరల్ అవుతుంది. అఖిల్ బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు , బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అఖిల్ ని బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ తన ధర్మ ప్రొడక్షన్స్ ద్వారా ఎంట్రీ ఇప్పించనున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: