సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు ఇప్పటికే ఈ సంవత్సరం సర్కారు వారి పాట మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ కి పరుశురామ్ దర్శకత్వం వహించగా  ,  కీర్తి సురేష్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. సముద్ర ఖనిమూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. ఎస్ ఎస్ తమన్మూవీ కి సంగీతాన్ని అందించాడు. మంచి అంచనాలు నడుమ విడుదల అయిన సర్కారు వారి పాట మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకొని బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది. ఇలా సర్కారు వారి పాట మూవీ తో మంచి విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకున్న మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్నడు. ఈ మూవీ మహేష్ బాబు కెరియర్ లో 28 వ సినిమా.  

ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యింది. ఈ మూవీ షూటింగ్ ని చిత్ర బృందం యాక్షన్ ఎపిసోడ్ లతో ప్రారంభించింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ యాక్షన్ ఎపిసోడ్ సగం భాగం పూర్తయినట్లు తెలుస్తోంది. మిగిలిన సగం భాగాన్ని ఒక వారం విరామం తీసుకున్న తర్వాత కంటిన్యూ చేసే ఉద్దేశంలో మూవీ యూనిట్ ఉన్నట్లు తెలుస్తుంది. ఈ యాక్షన్స్ సన్నివేశాలు అదిరి పోయే రేంజ్ లో వస్తున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ఈ మూ వీలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ,  తమ ఈ మూవీ కి తమన్ సంగీతం అందిస్తున్నాడు. మహేష్ బాబు ,  త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడవ సినిమా కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: