టాలీవుడ్ యంగ్ స్టార్ హీరో నాని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిరంజీవి, రవి తేజ తరువాత స్వయం కృషితో పైకి వచ్చిన స్టార్ హీరో. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో న్యాచురల్ స్టార్ అనగానే ఠక్కున గుర్తొచ్చే హీరో నాని.  అష్టాచమ్మా సినిమాతో హీరోగా అరంగేట్రం చేసిన నాని.. ఆ సినిమా తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో మెప్పించాడు.ఇటీవలే శ్యామ్ సింగరాయ్ లాంటి అద్భుతమైన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నాని... అంటే సుందరానికీ మూవీతో ప్రేక్షకులను అలరించడంలో ఫెయిల్ అయ్యాడు. ఫలితంగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. సరే ఇవి పక్కన పెడితే హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా తన సహజనటనతో తెలుగు ప్రేక్షకుల మనసులలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు నాని . ప్రస్తుతం ఈ హీరో దసరా చేస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలు తెరకెక్కిస్తున్న ఈ మూవీలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. అయితే ఇండస్ట్రీలో స్టార్‏గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాని.. చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి 14 సంవత్సరాలు పూర్తైంది.


ఈ సందర్భంగా నాని తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.నాని మాట్లాడుతూ.. ' మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకోవాలని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. 2005లో రాధాగోపాలం కు దర్శకుడు బాపు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాను. కు సంబంధించిన ప్రతి విషయాన్ని ఇక్కడకు వచ్చాకే నేర్చుకున్నాను. కొన్ని రోజులు రేడియో జాకీగా పనిచేశాను. ఆ తర్వాత కొన్ని ప్రకటనల్లో నటించే అవకాశాలు వచ్చాయి. 2008లో విడుదలైన అష్టా చెమ్మా నాకు పేరు తీసుకువచ్చింది. అయితే ఇదంతా ఒక్కరాత్రిలో వచ్చింది కాదు. ఎంతో కష్టపడ్డాను. నేను చేసే ప్రతి పనిలో నా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇంత మంది అభిమానుల ప్రేమ, అప్యాయతలు నాకు దక్కుతున్నాయంటే నిజంగా నేను అదృష్టవంతుడిని ' అంటూ చెప్పుకొచ్చారు.ఇక దసరా సినిమా పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అవుతుంది. ఇక ఈ సినిమా హిట్ తో నాని కూడా పాన్ ఇండియా జాబితాలో చేరిపోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. మరి చూడాలి దసరా ఎలాంటి హిట్ ని నమోదు చేస్తుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: