పాన్ ఇండియా టాప్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తారక్, చరణ్ హీరోలుగా నటించిన "ఆర్ ఆర్ ఆర్" సినిమా పాన్ ఇండియా వైడ్ ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో చెప్పాల్సిన పనిలేదు. బాక్సాఫీస్ వద్ద 1200 కోట్ల వసూళ్లతో ఇండియాన్ సినిమా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది.ఓటీటీ వేదికగా విదేశాల్లో కూడా సత్తా చాటిన చిత్రంగా నిలిచింది. హాలీవుడ్ మేకర్స్ సైతం మెచ్చిన కళాఖండంగా ఈ సినిమా కీర్తింపబడింది. బ్రిటన్ సామ్రాజ్యంతో రామ్-భీమ్ పోరాటం ఆద్యంతం ఆకట్టుకుంది.సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలకు విదేశాల నుంచి నటుల్ని దిగుమతి చేసారు. గ్లోబల్ స్థాయిలో సినిమా రీచ్ అయిందంటే? దాని వెనుక విదేశీ నటుల ప్రతిభ ఎంతో కీలకంగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే బ్రిటన్ కి చెందిన కొందరు మాత్రం తీవ్ర స్థాయిలో సినిమాని విమర్శిస్తున్నారు. సినిమాలో తమని తక్కువగా చూపించారంటూ బ్రిటీషర్లు ఆరోపిస్తున్నారు.తాజాగా ఈ విషయంపై రాజమౌళి ఓ ఆంగ్ల మీడియాతో స్పందించారు. `విలన్ పాత్రలో బ్రిటన్ వ్యక్తి నటించినంత మాత్రాన బ్రిటీషర్లుందర్నీ విలన్లుగా చూపించినట్లు కాదు. అలా అనుకుని ఉంటే బ్రిటన్ లో ఆర్ ఆర్ ఆర్ ఎలా విజయం సాధిస్తుంది.


అక్కడి ప్రేక్షకులు సైతం మెచ్చిన గొప్ప చిత్రంగా నిలిచిందంటే దాని వెనుక వాళ్ల హస్తం ఉంది.అందరూ "ఆర్ ఆర్ ఆర్" సినిమాని వ్యతిరేకిస్తే అక్కడ విజయ సాధించేది కాదు. సినిమా ప్రారంభానికి ముందు వచ్చే డిస్క్లైమర్ చూసే ఉంటారు. ఒకవేళ అది మిస్ అయినా సమస్య లేదు ఎందుకంటే? ఆర్ ఆర్ ఆర్ అనేది పాఠం కాదు. అదొక కథ. ఈ విషయం సినిమాలో విలన్..హీరోలుగా నటించిన వారికి తెలుసు. ప్రేక్షకులకు ఎలాగూ అర్ధమవుతుంది.ఓస్టోరీ టెల్లర్ గా ఇవన్నీ అర్ధమైతే? ఇతర విషయాల గురించి ఆలోచించాల్సిన పని ఉండదు` అని అన్నారు.ప్రస్తుతం రాజమౌళి దృష్టి అంతా కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా మీదే ఉంది. ఆ సినిమాని పాన్ వరల్డ్ సినిమాగా రిలీజ్ చేసి హాలీవుడ్ ధీటుగా టాలీవుడ్ పరిశ్రమని నెలబెట్టాలని చూస్తున్నాడు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అయిపోయిన వెంటనే రాజమౌళి సినిమా పట్టాలెక్కనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: