సినీ ఇండస్ట్రీలో ఉండే వారి జీవితాలు ఎప్పుడు ఒకేలా ఉండవు . ఆకాశంలో స్టార్స్ లా ఉన్న వారి జీవితాలు ఉన్నట్టుండి ఎప్పుడు  ఒక్కసారిగా నేలరాలిపోతాయి.వారి జీవితంలో అందనంత ఎత్తుకు ఎదిగి ఆ తర్వాత సాధారణ స్థితికి వెళ్లిపోయిన సెలబ్రిటీలు చాలా మందే ఉన్నారు. అయితే  ఇక వారంతా తమ తప్పిదాల కారణంగా అలా అయ్యారు.  కరోనా కారణంగా ఆర్ధికంగా నష్టపోయిన సెలబ్రిటీల కథ మాత్రం వేరే. ఇక లాక్ డౌన్ సమయంలో అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులు పడిన సెలబ్రిటీలు చాలా మంది ఉన్నారు.అంతేకాదు  చిన్న చిన్న కళాకారుల నుంచి ఓ మోస్తరు సెలబ్రిటీల వరకూ చాలా మంది పనులు లేక ఇబ్బందులు పడ్డారు. 

ఇక అలాంటి వారిలో బాలీవుడ్ బుల్లితెర నటి ఏక్తా శర్మ ఒకరు. అయితే ఈమె అవకాశాలు లేక కాల్ సెంటర్ లో ఉద్యోగం చేస్తోంది.ఇక కరోనా కారణంగా తన జీవితం తలకిందులయ్యిందని, రెండేళ్లుగా తనకి ఇండస్ట్రీలో అవకాశాలు లేవని ఏక్తా శర్మ వెల్లడించింది. అయితే అవకాశాలు లేక ఇల్లు గడవడం కష్టమైందని, ఇల్లు గడవడం కష్టంగా ఉందని నగలు అమ్మేశానని చెప్పుకొచ్చింది.ఇదిలావుంటే  ప్రస్తుతం తాను అద్దె ఇంట్లో ఉంటున్నట్లు తెలిపింది.అంతేకాదు  అవకాశాలు రావడం లేదని ఏడుస్తూ కూర్చుంటే బతుకు నడవదు కదా.. అందుకే చదువుకి తగ్గా జాబు వెతుక్కున్నానని, కాల్ సెంటర్ లో పని చేస్తున్నానని చెప్పింది. 

ఇక కాల్ సెంటర్ లో పని చేయడం తప్పనిపించలేదని ఆమె వెల్లడించింది.అంతేకాదు ఎవరో వస్తారు, మనకేదో చేస్తారు, ఏదో అద్భుతం జరుగుతుందని ఎదురుచూడడం టైం వేస్టని.. కాల్ సెంటర్ లో పనిచేస్తూ ఆడిషన్స్ ఇస్తున్నానని ఆమె చెప్పుకొచ్చింది. అయితే ఎప్పటికైనా మళ్ళీ అవకాశాలు వస్తాయన్న నమ్మకం ఉందని ఆమె తెలిపింది.  ఏక్తా డాడీ సంఝా కరో, కుసుమ్, క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ, కామినీ-దామిని వంటి సీరియల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. ఈమె  చివరగా 'బెప్నా ప్యార్ అనే టీవీ షోలో కనిపించింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: