టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ప్రస్తుతం కింగ్ నాగార్జున కుర్ర హీరోలు తో పోటీపడుతూ లు చేస్తూ దూసుకుపోతున్నారు. ఇక రీసెంట్ గా బ్రహ్మాస్త్ర తో మంచి విజయాన్ని అందుకున్నాడు నాగ్.ఇదిలావుంటే ఇక ప్రస్తుతం కింగ్ క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే ‘ది ఘోస్ట్’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో ఈ తెరకెక్కుతోంది.ఈ ప్రమోషన్స్ ఇప్పటికే జోరందుకున్నాయి. కాగా నాగార్జున- సోనాల్ చౌహాన్ ల బ్యూటీఫుల్ కెమిస్ట్రీతో యువతను ఆకట్టుకున్న ఫస్ట్ సింగిల్ వేగంతో మ్యూజిక్ ప్రమోషన్లు కూడా చార్ట్‌బస్టర్ నోట్‌లో ప్రారంభమయ్యాయి. 

ఇకపోతే  ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించనున్నారు.అయితే  ది ఘోస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 25న గ్రాండ్ గా జరగనుంది.ఇక  కర్నూలులోని ఎస్టీబీసీ మైదానం ఈ వేడుకకు వేదికైంది.అంతేకాదు  గ్రాండ్ గా జరిగే ఈ వేడుకకు టీమ్ అంతా హాజరుకానున్నారు.అయితే  ఇక ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి రానున్నారని టాక్ వినిపిస్తోంది. కాగా మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం గాడ్ ఫాదర్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు.అయితే  ఈ సినిమా  తో పాటు బోళా శంకర్, వాల్తేరు వీరయ్య లు కూడా షూటింగ్ దశలో ఉన్నాయి. అయితే  ఇక చిరు, నాగార్జున మంచి మిత్రులన్న విషయం తెలిసిందే.

కాగా కింగ్ నాగార్జున  హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ షోకు మెగాస్టార్ హాజరైన విషయం తెలిసిందే.ఇదిలావుంటే  ఇప్పుడు మరోసారి నాగ్ కోసం మెగాస్టార్ రానున్నారని అంటున్నారు. అయితే కర్నూల్ లో జరిగే ఘోస్ట్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ సందడి చేయనున్నారట.. చిరుతో పాటు దర్శకధీరుడు రాజమౌళి కూడా హాజరుకానున్నారని టాక్.ఇమ  శ్రీవెంకటేశ్వర స్ ఎల్‌ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్ తో కలసి పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్‌లు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.అంతేకాదు  భారీ అంచనాలున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న థియేటర్లలోకి రానుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: