ప్రభాస్ హీరోగా ఇప్పుడు నాలుగు సినిమాలు రూపొందుతూ ఉండడం నిజంగా మంచి విశేషం అనే చెప్పాలి. సలార్ చిత్రం యొక్క షూటింగ్ లో పాల్గొంటున్న ఆయన అదే సమయంలో ప్రాజెక్టు కే
సినిమా యొక్క షూటింగ్లో కూడా పాల్గొంటూ రెండు భారీ చిత్రాలను ఒకేసారి చేస్తున్న హీరోగా రికార్డులకు ఎక్కుతున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా పాన్
ఇండియా సినిమాలే కావడం విశేషం. ఇకపోతే మారుతీ తో కలిసి ఆయన ఓ
సినిమా చేయబోతున్నాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఈ
సినిమా యొక్క షూటింగ్ సైలెంట్ గా మొదలయ్యిందని తొందరలోనే ఈ సినిమాను పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేస్తాడని అంటున్నారు. ఇకపోతే
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో కూడా ఆయన స్పిరిట్ అనే సినిమాను మొదలు పెట్టవలసి ఉంటుంది. వచ్చే ఏడాది ఏ
సినిమా మొదలు కాబోతోంది. ఈ విధంగా ఈ నాలుగు సినిమాలను లైన్లో పెట్టి వచ్చే ఏడాది పూర్తి చేయాలని ప్రభాసు భావిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మరొక మూడు పాన్
ఇండియా సినిమాలను ఈ
హీరో ఓకే చేశాడు అనే వార్తలు రావడం నిజంగా
ప్రభాస్ అభిమానులను ఎంతగానో సంతోష పెడుతుంది.
గౌతమ్ దర్శకత్వంలో ఒక
సినిమా చేయడానికి
ప్రభాస్ రంగం సిద్ధం చేస్తున్నాడట. తొందర్లోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇవ్వబోతున్నారు. ఇకపోతే
బాలీవుడ్ దర్శకులైన ఓ ఇద్దరితో ఆయన
సినిమా చేయడానికి రంగం సిద్ధం అవుతుందట. ఇప్పటికే కథలను ఓకే చేసిన
ప్రభాస్ తొందరలోనే వాటికి సంబంధించిన అనౌన్స్మెంట్లు కూడా ఇవ్వబోతున్నాడు. ఆ విధంగా ఏడు సినిమాలతో
ప్రభాస్ ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నాడని చెప్పవచ్చు. ఏదేమైనా
ప్రభాస్ పాన్
ఇండియా హీరో గా ఇప్పుడు చేస్తున్న సినిమాలతో ప్రేక్షకులను ఎంతో అలరిస్తారని చెప్పాలి. సలార్
సినిమా విడుదల తర్వాత ఎలాంటి క్రేజ్
ప్రభాస్ అందుకుంటాడో చూడాలి.