ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమాలలో భారీ బడ్జెట్ తో రూపొందిన ఆది పురుష్ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా యొక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ భారీగా ఉండడంతో ఈ సినిమా విడుదలకు ఇంతటి ఆలస్యం అయిందని చిత్ర బృందం చెబుతుంది. దీపికా పడుకునే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా రామాయణం ఆధారంగా రూపొందింది అని చెబుతున్నారు.

కారణం ఏదైనా కూడా ఈ సినిమాపై వేరే స్థాయిలో క్రేజ్ ఉంటుందని అందరూ భావించారు కానీ ఈ సినిమా యొక్క అప్డేట్లు రాకపోవడంతో ప్రభాస్ అభిమానులు ఈ చిత్రం గురించి పట్టించుకోవడమే మానేశారు. ఇది దృష్టిలో పెట్టుకుని తాజాగా ఈ సినిమా యొక్క టీమ్ అప్డేట్ విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసింది చిత్ర బృందం. అక్టోబర్ రెండవ తేదీన ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి. 

దీనిపై ఎలాంటి ప్రకటన లేని నేపథ్యంలో ఇది నిజమో అబద్దమో అన్న అయోమయంలో అభిమానులు ఉన్నారు. విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండటంతో ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్లను విడుదల చేసి సినిమాపై క్రేజ్ పెంచాలని అభిమానులు కోరుకుంటున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన ఓ ప్రకటన రానుంది. రాముడు గా ప్రభాస్ నటిస్తూ ఉండగా ఈ సినిమా తప్పకుండా దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో విజయాన్ని అందుకుంటుంది అని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ భారీ యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తున్నాడు. అవి ఎంతటి స్థాయిలో రూపొందుతున్నాయో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇక ఆది పురుష్ సినిమా తర్వాత ప్రభాస్ సలార్ సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: