తెలుగు సినిమా పరిశ్రమలో ప్రేక్షకులను విపరీతంగా అలరించే దర్శకులలో ఒకరు వివి వినాయక్. ఆయన దర్శకత్వం వహించిన తొలి సినిమా నుంచి ఇప్పటివరకు మాస్ ఆడియన్స్ ను టార్గెట్ గా చేసుకొని చేసిన సినిమాలే. అప్పట్లో ఆయన సినిమాలకు రికార్డు స్థాయిలో వసూలు వచ్చేవి. ఆ తర్వాత కాలంలో తన సత్తాను చాటుకునే విధానంలో కొంత తడబడ్డ వినాయక్ ఇప్పుడు బాలీవుడ్ లో కూడా తన ప్రతిభ చూపేందుకు సిద్ధమవుతున్నాడు.

 బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న సినిమాకి దర్శకత్వం వహిస్తున్న వినాయక్ తాజాగా మరొక భారీ ప్రాజెక్టు చేయడానికి రంగం సిద్ధం చేశాడు అన్న వార్తలు రావడం ఒకసారిగా టాలీవుడ్ ను షేక్ చేసింది. చాలామంది పెద్ద హీరోలు ఆయనతో సినిమా చేయడానికి వెనకడుగు వేస్తున్నారు. దాంతో మీడియం రేంజ్ హీరోలు ఈ దర్శకుడు తో సినిమా చేయడానికి రంగం సిద్ధం చేస్తున్న నేపథ్యంలో 500 కోట్ల భారీ బడ్జెట్ తో వివి వినాయక ఒక సినిమాను చేయబోతున్నాడు అనే వార్తలు రావడం ఒక్కసారిగా అందరిని ఆశ్చర్యపరిచింది. 

ఫామ్ లో ఉన్న దర్శకుడు కాకపోవడం తో ఆయనపై ఈ విధమైన ఆశ్చర్యాలు వ్యక్తం అవ్వడానికి కారణం అవుతుంది. పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో ఇది రావడం పెద్ద ఆశ్చర్యం కాకపోయినా కూడా ఈ దర్శకుడిని నమ్మి ఏ నిర్మాత అంతా ఖర్చు పెడుతున్నాడు అన్న ఆసక్తి మాత్రం కలుగుతుంది. తొందర్లోనే దీనికి సంబంధించిన ఒక పూర్తి క్లారిటీ చిత్ర బృందం ఇవ్వనుంది. మొన్నటి దాకా వినాయక్ బాలీవుడ్ లో తన రెండవ సినిమా చేస్తున్నాడు అన్న వార్తలు వినిపించాయి. మరి ఆ సినిమానే 500 కోట్ల బడ్జెట్ సినిమానా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. బెల్లంకొండ శ్రీనివాస్ తో తెలుగులో భారీ విజయాన్ని సాధించిన చత్రపతి రీమేక్ సినిమాను బాలీవుడ్ లో చేస్తున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: