ప్రభాస్ హీరోగా
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్
సినిమా యొక్క షూటింగ్ ఇప్పుడు శెరవేగంగా జరుపుకుంటుంది.
కేజీఎఫ్ సినిమా తరువాత అంతటి స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న ఈ
సినిమా తప్పకుండా సంచలన విజయంతో పాటు భారీ వసూళ్లను కూడా అందుకోవడం ఖాయం అని చెబుతున్నారు. ఆ విధంగా
ప్రశాంత్ నీల్ ఈ
సినిమా కోసం చాలా సమయాన్ని కేటాయించుకోవడం
ప్రభాస్ అభిమానులను కొంత నిరాశ పరుస్తుంది.
ఎప్పుడో అనౌన్స్ అయినా కూడా ఈ సినిమాను మొన్నటిదాకా షూటింగ్ చేయలేదు దానికి పలు కారణాలు కారణమైనా కూడా ఈ చిత్రం వచ్చే ఏడాది
సెప్టెంబర్ కు పోస్ట్
ఫోన్ అవడం అందరిని నిరాశపరిచే విషయమనే చెప్పాలి. అసలే వరుస ప్లాపులతో సతమతమవుతున్న
ప్రభాస్ ఈ చిత్రంతో ఘనవిజయం అందుకోవాలని భావిస్తున్న నేపథ్యంలో ఈ
సినిమా ఎందుకు ఇంతటి ఆలస్యం అవుతుందో అన్న అయోమయం వారిలో నెలకొంది.
దానికి తోడు ఈ
సినిమా రెండు భాగాలుగా రాబోతుంది అనే వార్తలు రావడం అభిమానులను ఎంతగానో సంతోష పెట్టిస్తుంది. అయితే ఇక్కడ అసలు విషయం బయటపడింది ఈ సినిమాకు రెండు భాగాలుగా చేయాలని అనుకోవడమే ఈ చిత్రం యొక్క విడుదల ఆలస్యం అవుతుందని చెబుతున్నారు దర్శకుడు కి వచ్చిన ఈ ఆలోచన వల్లనే తొలిభాగం విడుదల ఆలస్యం అవుతుందని తెలుస్తుంది.
కేజీఎఫ్ 2 భాగాలతో ప్రేక్షకులను అలరించిన ప్రశాంత నీల్ అదే సెంటిమెంట్ను కొనసాగిస్తూ ఈ సినిమాను కూడా రెండు భాగాలుగా చేయడానికి సిద్ధమవుతున్నాడు. మరి తొందరగా ఈ సినిమాను విడుదల చేసి
ప్రభాస్ యాక్షన్ సినిమాలను కోరుకునే వారిని సంతోష పెడతారని చూడాలి. ఇక
ప్రభాస్ చేయబోయే సినిమాల యొక్క లైనప్ బాగానే ఉంది. మరో మూడు పాన్
ఇండియా సినిమాలను ఒప్పుకునే విధంగా ఆయన రంగం సిద్ధం చేశాడు.