ఇటీవలే మల్టీ స్టారర్‌ ప్రాజెక్టు బ్రహ్మాస్త్రమ్ లో రణ్‌ బీర్‌ కపూర్‌తో కలిసి మెరిసింది అలియాభట్‌ .బ్రహ్మాస్త్ర విడుదలైనప్పటికీ అలియా భట్‌ ప్రమోషన్స్‌కు టైం కేటాయించడం విశేషం.
బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అలియాభట్‌ ఇటీవలే మల్టీ స్టారర్‌ ప్రాజెక్టు బ్రహ్మాస్త్ర లో మెరిసిన విషయం తెలిసిందే. రణ్‌ బీర్‌ కపూర్‌తో కలిసి బ్రహ్మాస్త్రలో మెరిసింది. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫస్ట్‌ పార్టు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ లభించడమే కాకుండా కలెక్షన్ల పరంగా కూడా నిర్మాతలకు కాసులు కురిపిస్తున్నట్టు ఇప్పటివరకు వచ్చిన వసూళ్లు చెబుతున్నాయి. అలియాభట్‌ బ్రహ్మాస్త్ర విడుదలైనప్పటికీ ప్రమోషన్స్‌కు టైం కేటాయించడం విశేషం.

బ్యాక్‌ టు బ్యాక్‌ ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై హైప్‌ మరింత పెంచేస్తుంది అలియాభట్‌. ఇక బ్రహ్మాస్త్ర మూడు పార్టులుగా వస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్‌గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అలియా చెప్పిన విషయం ఇపుడు టాక్‌ ఆఫ ది ఇండస్ట్రీగా మారింది. ఈ సినిమా సీక్వెల్‌ లో ఓ స్టార్‌ హీరోయిన్‌ ఉంటే బాగుంటుందని అభిప్రాయడింది అలియా.

ఇంతకీ ఆ స్టార్‌ హీరోయిన్‌ ఎవరనే కదా మీ డౌటు. ఇండియన్‌ ఫిలిం ఇండస్ట్రీలో వన్‌ ఆఫ్‌ ది లీడింగ్‌ హీరోయిన్‌ అయిన దీపికా పదుకొనే. ఫస్ట్‌ పార్ట్‌లో అమృతగా గెస్ట్‌ రోల్‌లో మెరిసింది దీపికాపదుకొనే. సెకండ్‌ పార్ట్‌లో దీపికా కీలక పాత్రలో కనిపించాలని ఉందని తన మనసులో మాట చెప్పింది అలియా. ఫస్ట్‌ పార్టు సక్సెస్‌తో ఫుల్‌ జోష్‌ మీదున్న అయాన్‌ ముఖర్జీ రెండో పార్టు కోసం ప్రిపరేషన్‌ ప్లాన్‌లో ఉన్నాడని సమాచారం.

తాజా టాక్‌ ప్రకారం రెండో పార్టులో చాలా మంది పాపులర్‌ యాక్టర్లు కనిపించబోతున్నారట. మొత్తానికి అలియా భట్‌ పరోక్షంగా దీపికాపదుకొనే రెండో పార్టులో ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌లో కనిపించనుందని హింట్‌ ఇచ్చిందా..?..తనకు అనిపించింది చెప్పిందా..? అనేది తెలియాలంటే మరికొంతకాలం వెయిట్‌ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: