టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమా షూటింగుల తో ఎంతో బిజీ గా ఉన్నారు. ఈ క్రమంvలోనే ఈయన ప్రాజెక్ట్ కే, సలార్ సినిమా షూటింగుల తో ఎంతో బిజీగా ఉన్నారు.
అయితే ఇప్పటి కే ప్రభాస్సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ లో పాల్గొనాల్సి ఉండగా తన పెద నాన్న కృష్ణంరాజు మరణించడంతో ఈ సినిమా షెడ్యూల్ చిత్రీకరణ కాస్త ఆలస్యమైంది. కృష్ణంరాజు మరణించడం తో ఆయన కు సంబంధించిన సంస్కరణ సభలు,

సమారాధన సభ అంటూ ప్రభాస్ ఈ కార్యక్రమాల ను నిర్వహిస్తూ ఎంతో బిజీ గా ఉన్నారు. ఇలా ఈ కార్యక్రమాల లో పాల్గొనడం వల్ల ఈయన తన సినిమా షూటింగు లకు కాస్త విరామం ప్రకటించారు. సమారాధన సభ కార్యక్రమాలు పూర్తి కావడం తో ప్రభాస్ తిరిగి తన సినిమా షూటింగు లలో పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో నే ప్రభాస్ నేడు రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్నటు వంటి సలార్ సినిమా షూటింగ్ కార్యక్రమం లో పాల్గొన్నారు.
ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో ప్రభాస్ శృతి  హాసన్ జంటగా పాన్ ఇండియా స్థాయి లో తెరకెక్కు తున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. ఈ షెడ్యూల్ చిత్రీకరణలో భాగంగా ప్రభాస్ తో పాటు మరి కొంతమంది సెలబ్రిటీలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు సమాచారం. ఇప్పటికే 40 శాతం షూటింగ్ పనులను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుత షెడ్యూల్ చిత్రీకరణ రామోజీ ఫిలిం సిటీలో జరగగా ఈ షెడ్యూల్లో ప్రభాస్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.

సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కేజిఎఫ్ వంటి బ్లాక్ పోస్టర్ హిట్ రావడంతో ప్రభాస్ సలార్ సినిమాపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: