సాయి ధరమ్ తేజ్.. మెగా ఫ్యామిలీ నుండి హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. సినిమాలు తక్కువగానే ఉన్నప్పటికీ ఫాలోయింగ్ మాత్రం ఎక్కువ గానే ఉంటుంది.

ప్రస్తుతం సాయి ధరంతేజ్ పవన్ కళ్యాణ్ హీరో గా రాబోతున్న వినోదయ సిత్తం అనే సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా వల్ల సాయి ధరమ్ తేజ్ ఖాతాలో సూపర్ హిట్ పడడం ఖాయం అని పవన్ అభిమానులు అంటున్నారు. అయితే సాయి ధరంతేజ్ గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి.

సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. ఓ సినిమా హిట్ అయితే రాబోయే సినిమా కూడా హిట్ కొట్టాలనే బాధ్యత మరింత పెరుగుతుంది.నా మొదటి సినిమా రేయ్ షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకొని విడుదల అవడానికి ఏకంగా ఐదు సంవత్సరాలు పట్టింది. నాకు ఏదైనా నచ్చకపోతే ఆ పని అస్సలు చేయను.నేను చదువులో యావరేజ్ స్టూడెంట్. నేను సినిమాల్లోకి రాకపోతే ఇప్పుడు నిరుద్యోగిగా మిగిలి పోయేవాడిని. నాగబాబు గారు నన్ను చాలా దగ్గరుండి నా బాధ్యత తీసుకున్నారు.నా జీవితంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఇక సినిమాల్లోకి వచ్చాక పవన్ కళ్యాణ్ గారు నా బాధ్యత తీసుకున్నారు.

నేను చదువుకునే రోజుల్లో కాలేజీకి వెళ్లకపోతే టీచర్లు చాలా ఫీలయ్యేవారు. ఇక అప్పట్లో నేను చాలా మంది అమ్మాయిలకు ప్రపోజ్ చేశాను కానీ ఏ ఒక్కరు సెట్ అవ్వలేదు నా లవ్ స్టోరీ లు అన్నీ హార్ట్ బ్రేకింగే.ఎవరు కూడా నాకు ప్రపోజ్ చేయలేదు. చాలామంది నన్ను ఫ్రెండ్ అనుకున్నారు.ఇక మరికొంతమంది అయితే అన్నయ్య అని పిలిచేవారు. వారు నన్ను అన్నయ్య అని పిలిస్తే నా మీద నాకే చాలా అసహ్యం అనిపించేది అంటూ సాయి ధరమ్ తేజ ఆ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు. ఇక ఆ ఇంటర్వ్యూ లో సాయి ధరం తేజ్ మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: