కొంతకాలంగా హిట్టు లేక అల్లాడుతున్న బాలీవుడ్ ను 'బ్రహ్మాస్త్ర' కొంతవరకు నిలబెట్టింది అనే చెప్పాలి.ఇక  సోసియో ఫాంటసీ మరియు అడ్వెంచరస్ మూవీగా రూపొందిన 'బ్రహ్మాస్త్ర' సెప్టెంబర్ 9న రిలీజ్ అయ్యింది.అయితే సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. ఇక  5 ఏళ్ల తరబడి తీసిన ఈ సినిమాకు రూ.500 కోట్ల బడ్జెట్ పైనే అయ్యింది అంటూ బి టౌన్ కోడై కూస్తోంది.అయితే  వారి అనాలిసిస్ ప్రకారం ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వనట్టే లెక్క.కాగా  ఈ మూవీని డిజాస్టర్ గా కూడా వారు పేర్కొంటున్నారు. ఇక ఈ సినిమా నష్టాలు తీర్చే బాధ్యతను హీరో రణబీర్ కపూర్,

 హీరోయిన్ అలియా భట్ తీసుకున్నట్లు కూడా ప్రచారం మొదలైంది.అయితే  ఈ చిత్రానికి నష్టాలు రావడంతో వారు తమ పారితోషికాలు త్యాగం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ఈ విషయం పై దర్శకుడు అయాన్ ముఖర్జీ క్లారిటీ ఇచ్చాడు. ఇక. దర్శకుడు అయాన్ ముఖర్జీ   మాట్లాడుతూ.. 'చాలా మంది వ్యక్తిగత త్యాగాల వల్ల ఈ చిత్రాన్ని రూపొందించడం వీలైంది అనే మాట వాస్తవం.అయితే రణభీర్, అలియా ఈ చిత్రం కోసం తీసుకున్న పారితోషికం వెనక్కి ఇచ్చేసారు అన్నది అసత్య ప్రచారం. ఇక.నిజానికి పార్ట్ 1 కి గాను రణబీర్ ఎటువంటి పారితోషికం తీసుకోలేదు. 

హీరోయిన్ అలియా భట్ ఈ ప్రాజెక్టులో 2014లో జాయిన్ అయ్యింది. అయితే ఇప్పుడు ఆమె తీసుకుంటున్న పారితోషికాన్ని పోల్చి చూస్తే 'బ్రహ్మాస్త్ర' కి ఆమెకు ఆఫర్ చేసిన పారితోషికం చాలా తక్కువ.అంతేకాదు ఆమె నిర్మాణ భాగస్వామిగా కూడా వ్యవహరించింది' అంటూ చెప్పుకొచ్చాడు  దర్శకుడు అయాన్ ముఖర్జీ  . అయితే అలాగే రణబీర్ మాట్లాడుతూ.. ' ఈ చిత్రానికి నేను ఎటువంటి పారితోషికం తీసుకోలేదు. ఇక ఈ చిత్రం వల్ల నేను చాలా పొందాను. అంతేకాదు చాలా నేర్చుకున్నాను' అంటూ చెప్పుకొచ్చాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: