ఇస్మార్ట్ శంకర్ మూవీతో  కెరీర్లో ఒక లైఫ్ లైన్ దొరికింది పూరి జగన్నాథ్ కు. అయితే గత దశాబ్ద కాలంలో తన సొంత కథతో పూరి కొట్టిన ఏకైక హిట్ ఇది.ఇక దీంతో అభిమానులకు మళ్లీ ఆయన మీద గురి కుదిరింది.ఇదిలావుంటే  విజయ్ దేవరకొండ లాంటి సెన్సేషనల్ హీరో ఆయన్ని నమ్మి సినిమా చేశాడు.  ఇటు అభిమానులు, అటు విజయ్ నమ్మకాన్ని పూరి నిలబెట్టుకోలేకపోయాడు. ఇక లైగర్ మూవీతో అందరినీ తీవ్ర నిరాశకు గురి చేశాడు.అయితే ఈ సినిమా యావరేజ్ అనే స్థాయిలో ఉన్నా విజయ్ తన పెర్ఫామెన్స్ తో దాన్ని మరో స్థాయికి తీసుకెళ్లేవాడు. 

కాగా  పూరి మరీ పేలవమైన సినిమా తీయడంతో విజయ్ పెర్ఫామెన్స్ కూడా సినిమాను నిలబెట్టలేకపోయింది. అయితే ఈ దెబ్బతో పూరి పరిస్థితి ఘోరంగా తయారైంది.అంతేకాదు  పెద్ద స్టార్ల సంగతి పక్కన పెట్టేస్తే మిడ్ రేంజ్ హీరోలు కూడా ఆయనకు డేట్లు ఇవ్వడం కష్టంగానే కనిపిస్తోంది.ఇక ఈ స్థితిలో తన కొడుకు ఆకాశ్ తో పూరిసినిమా చేయబోతున్నట్లుగా ఇటీవల ప్రచారం జరిగింది. ఇకపోతే దాని గురించి క్లారిటీ లేదు.  ఈలోపు పూరి చూపు రామ్ మీద పడిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే పూరి వరుస ఫ్లాపుల్లో కొట్టుమిట్టాడుతున్న టైంలో ఆయన్ని నమ్మి ఇస్మార్ట్ శంకర్ చేశాడు రామ్.

ఇక ఆ సినిమా ఊహించిన స్థాయిలో బ్లాక్ బస్టర్ అయింది.అంతెందుకు ఇద్దరి కెరీర్లకూ ఊపు తెచ్చింది.ఇక  ఈ సినిమాకు సీక్వెల్ చేస్తామని గతంలో ఇద్దరూ ప్రకటించారు. తర్వాత వేర్వేరు ప్రాజెక్టులతో బిజీ అయ్యారు. ఇప్పుడు అయితే  పూరీకి ఇంకే హీరో దొరికే పరిస్థితి లేదు.ఇదిలావుంటే ఇటీవల ది వారియర్ తో గట్టి ఎదురు దెబ్బ తిన్న రామ్.. బోయపాటి శ్రీను సినిమాకు రెడీ అవుతున్నాడు. ఇక ఈలోపు పూరి అతణ్ని కలిశాడని.. తనతో సినిమా చేసేందుకు కమిట్మెంట్ తీసుకున్నాడని అంటున్నారు.అయితే  రామ్ తో కుదిరినపుడు పూరి సినిమా చేయాలనుకుంటున్నాడని.. ఇస్మార్ట్ శంకర్-2 కోసమే ఇద్దరూ జట్టు కట్టే అవకాశాలున్నాయని అంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: