అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హాస్య నటుడు బోండామణి కి తనవంతు సాయం చేస్తానని ప్రముఖ హాస్య నటుడు వడివేలు పేర్కొన్నారు .
ఆయన శుక్రవారం తిరుచ్చెందూరు సుబ్రమణ్యస్వామిని దర్శనం చేసుకున్నారు. ఆలయానికి వచ్చిన వడివేలుకు వేదపండితులు స్వాగతం పలికారు. దైవదర్శనం అనంతరం.. తను చేస్తున్న సినిమాలతో పాటు, ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ తీరుపై కూడా ఆయన మీడియాతో మాట్లాడారు. తన తోటి నటుడు బోండామణికి తన వంతుగా సాయం అందిస్తానని వెల్లడించారు.
వడివేలు మీడియాతో మాట్లాడుతూ.. ''నేను ఇప్పుడు 'నాయ్‌ శేఖర్‌ రిటర్న్స్‌'  'మామన్నన్‌' చంద్రముఖి-2' వంటి చిత్రాల్లో నటిస్తున్నాను. ఈ చిత్రాల్లో హాస్యం ఎక్కువగా ఉంటుంది. గతంలో నాతో కలిసి నటించిన పలువురు హాస్య నటులు ఇప్పుడు లేరు. ఇపుడు వచ్చే చిత్రాలన్నింటిలో ఇద్దరు హాస్యనటులు పండించాల్సిన సన్నివేశాలలో కూడా ఒక్క నటుడే కనిపిస్తున్నాడు. సినిమా నిర్మాణంలో కూడా చాలా తేడా వచ్చింది. టెక్నాలజీని దృష్టిలో పెట్టుకుని ప్రేక్షకులు సినిమాలని చూస్తున్నారు. నాతో కలిసి నటించిన హాస్య నటుడు బోండామణి అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారనే విషయం మీకు తెలిసింది. ఆయనకు నా వంతు సాయం తప్పకుండా చేస్తాను. ఆయన త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను'' అని తెలిపారు.

ఇటీవల వడివేలు చంద్రముఖి 2 సెట్స్‌లో రాధిక శరత్ కుమార్‌ తో కలిసి కనిపించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగ వైరల్ అయిన విషయం మనకు తెలిసిందే. ఆ వీడియోలో ఆయన పండించిన హాస్యం.. రాధికనే కాదు.. ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరినీ ఆహ్లాదపరిచింది. ఈ వీడియోలో లారెన్స్  రాధిక కలిసి వడివేలు బుగ్గపై పంచ్ ఇచ్చారు. ఆ పంచ్‌కి వడివేలు ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌ గురించి చెబితే కిక్ ఉండదు.. చూడాల్సిందే. కమెడియన్‌గా తనదైన ముద్రతో టాప్ స్థానాన్ని సొంతం చేసుకున్న వడివేలు.. సడెన్‌గా కొన్ని సమస్యలు తలెత్తడంతో కొన్నాళ్లుగా నటనకు చాలా దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆ సమస్యలపై పోరాటం చేసి.. మళ్లీ ఇప్పుడు నటుడిగా బిజీ కావడంతో ఆయన అభిమానులు కూడా  ఒక్క సారిగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఏడు పైగా చిత్రాలకు సైన్ చేసినట్లుగా తెలుస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: