సమాజంలో రకరకాల మనస్తత్వం కలిగి.. రకరకాల బిహేవియర్ తో నడుచుకునే జనాలను.. మనం చూస్తూ ఉంటాం . అయితే వీళ్లల్లో పిచ్చి నమ్మకాలతో పిచ్చి చేష్టలు చేసే వాళ్ళని మనం చూస్తుంటాం.
పిల్లి ఎదురొస్తే ఆశుభమని పనులు ఆపుకొని ఇంట్లో కూర్చునే వాళ్ళు.. ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు తుమ్మితే అపశకునం అని కూర్చొని మంచినీళ్లు తాగి వెళ్లే వాళ్ళని మనం రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం . అయితే స్టార్ సెలబ్రెటీస్ కూడా ఇలాంటివి ఫాలో అవుతూ ఉంటారా..? అంటే ఈ హీరో బిహేవియర్ ని బట్టి అది నిజమని అనాల్సి వస్తుంది.

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ హ్యూజ్ రేంజ్ లో పారితోషకం తీసుకొని వన్ ఆఫ్ ది స్టార్ హీరో గా రాజ్యమేలుతున్నాడు . ఎంత భారీ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారో అంతే స్థాయిలో ప్రజాసేవ కూడా చేస్తూ ఉంటారు. కష్టం అంటూ తన వద్దకు వచ్చిన వాళ్ళని లేదు కాదు అనకుండా తోచినంత సహాయం చేసి ఆ ప్రాబ్లం తీర్చి పంపిస్తాడు అక్షయ్ కుమార్. అందుకే బాలీవుడ్ లో ఈ హీరోకి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంతేకాదు ఈ హీరో అంటే తెలుగు జనాలు కూడా పడి చచ్చిపోతారు.

కాగా రీసెంట్గా అక్షయ్ కుమార్ చేసిన ఓ పని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఆయన తన కోట్లు విలువ చేసే బంగ్లాను అమ్మేసుకున్నాడు. అది కూడా చీప్ రేట్ కి.. దానికి కారణం ఏంటని జనాలు ఆరా తీయగా ..ఓ పిచ్చి నమ్మకంతో అనే వార్త బయటకు వచ్చింది. అంధరి వెస్ట్ లో అక్షయ్ కుమార్ కు విలాసవంతమైన ప్రాపర్టీ ఉంది . ఆ అపార్ట్ మెంట్ ను అక్షయ్ గతంలో 4.12 కోట్లకు కొనుక్కున్నాడట. అయితే తాజాగా అపార్ట్ మెంట్ ను ఓ మ్యూజిక్ డైరెక్టర్ కు అమ్మేసినట్లు తెలుస్తుంది.

అది కూడా కేవలం 6 కోట్లకి . అయితే నిజానికి ఆ అపార్ట్మెంట్ ప్రాపర్టీ వాల్యూ దాదాపు 12 కోట్లకు పైగానే ఉందట. మరి ఇంత చీప్ రేట్ కి అక్షయ్ కుమార్ ఎందుకు అమ్మేసాడా అని ఆరా తీస్తే ఆ ప్రాపర్టీ కొన్న అప్పటి నుంచి అక్షయ్ కుమార్ కు ఏదో ఒక బ్యాడ్ సెంటిమెంట్ జరుగుతుందని ..సినిమాలు కూడా పెద్దగా ఆడట్లేదని ఎవరో జ్యోతిష్యుడు చెప్పారట . దీంతో పిచ్చి నమ్మకంతో దాదాపు 6 కోట్లు నష్టపోతూ చీప్ రేట్ కి ఆ ప్రాపర్ట్ ని అమ్మేసినట్లు బాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి . టెక్నాలజీ ఇంత పెరిగినా కానీ ఇంకా ఇలాంటి మూఢనమ్మకాలు జనాలు నమ్ముతున్నారా అనే ప్రశ్న ఇప్పుడు బాలీవుడ్ అంత శరవేగంగా వ్యాపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: