సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో 'అతడు', 'ఖలేజా' లాంటి సినిమాలొచ్చాయి.


ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలిసి వర్క్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి మహేష్ బాబు లుక్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. షూటింగ్ కి సంబంధించిన చిన్న వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఇంత హడావిడి చేసి ఈ సినిమాను మొదలుపెడితే..


ఇప్పుడు ఆరంభం లో సినిమా కి అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఆరు రోజుల పాటు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఇప్పుడు ఆగింది. దీని గురించి ఇండస్ట్రీలో రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. షూటింగ్ షెడ్యూల్ ఆగిందా..? లేక నిజంగానే సినిమా ఆగిపోయిందా..? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మహేష్ బాబు కి యాక్షన్ కొరియోగ్రాఫర్లు అంబు, అన్విలతో విబేధాలు వచ్చినట్లుగా ప్రచారం జరిగిందట.. ఒకవేళ అదే నిజమై తే ఈ యాక్షన్ సీన్ మొత్తం మళ్లీ రీషూట్ చేయాల్సి ఉంటుంది.


 


అది వీళ్లతోనా..? లేక వేరే యాక్షన్ మాస్టర్స్ ను తీసుకొస్తారా..? అనే విషయంలో త్వరలో నే క్లారిటీ రానుంది. ఇప్పుడు ఆరు రోజుల పాటు జరిపిన షూటింగ్ మొత్తం వృధా అయ్యేలా ఉందని యూనిట్ వర్గాల్లో కొందరు చెబుతున్నారు. అలా అయితే మాత్రం నిర్మాత చినబాబు కి కోట్లలో నష్టాలు రావడం ఖాయం. ఎందుకంటే.. ఒక స్టార్ హీరో సినిమాకి రోజుకి రూ.50 లక్షల నుంచి కోటి వరకు ఖర్చవుతుంది. ఆ లెక్కన చూసుకుంటే ఆరు రోజుల షూటింగ్ కి కోట్లలో ఖర్చవుతుందట..


 


ఈ ప్రచారంపై నిర్మాత చినబాబు స్పందిస్తారేమో చూడాలి. మరోపక్క ఈ సినిమా యాక్షన్ షెడ్యూల్ ని పూర్తి చేశామంటూ రెండు రోజుల క్రితం ప్రొడక్షన్ హౌస్ అఫీషియల్ హ్యాండి ల్ నుంచి ఒక పోస్ట్ ను పోస్ట్ చేశారు

మరింత సమాచారం తెలుసుకోండి: