తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న దర్శకులలో శ్రీను వైట్ల ఒకరు. శ్రీను వైట్ల ఇప్పటికే ఎన్నో విజయవంత మైన మూవీ లకు దర్శకత్వం వహించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తన కంటూ దర్శకుడి గా ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచు కున్నాడు. అలా ఎన్నో విజయవంత మైన మూవీ లకు దర్శకత్వం వహించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అదిరి పోయే క్రేజ్ ను సంపాదించుకున్న శ్రీను వైట్ల గత కొంత కాలంగా దర్శకత్వం వహించిన సినిమాలు ఏవి కూడా బాక్సా ఫీస్ దగ్గర చెప్పుకోదగ్గ విజయాలను సాధించ లేదు.

శ్రీను వైట్ల ఆఖరుగా మాస్ మహారాజా రవితేజ హీరోగా గోవా బ్యూటీ ఇలియానా హీరోయిన్ గా తెరకెక్కిన అమర్ అక్బర్ ఆంటోనీ అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచింది. ఆ తర్వాత శ్రీను వైట్ల ,  మంచు విష్ణు హీరోగా డీ అండ్ డీ  డబల్ డోస్ అనే పేరుతో ఒక మూవీని అనౌన్స్ చేశాడు. కాక పోతే ఇప్పటి వరకు ఈ మూవీ కి సంబంధించిన ఎలాంటి అప్డేట్ లను కూడా మూవీ యూనిట్ విడుదల చేయలేదు.

దానితో ఈ మూవీ ఆగిపోయినట్లు కొన్ని వార్తలు బయటికి వచ్చాయి. శ్రీను వైట్ల తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజ్ ఉన్న మాస్ హీరోలలో ఒకరు అయిన గోపి చంద్ తో ఒక మూవీ ని తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి. ఇది ఇలా ఉంటే గోపీచంద్ తాజాగా మారుతీ దర్శకత్వంలో తెరకెక్కిన పక్కా కమర్షియల్ మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ లో రాశి కన్నా హీరోయిన్ గా నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: