ఈ సినిమా తర్వాత డైరెక్టర్ లింగస్వామి దర్శకత్వంలో వచ్చిన ది వారియర్ చిత్రం భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఇక ఈ సినిమాతో కృతి శెట్టి కూడా బారి డిజాస్టర్ ను చూసింది. తమిళ, తెలుగు భాషలలో విడుదలైన ఈ చిత్రం బోల్తా కొట్టింది. ఈ సినిమా తర్వాత ఇప్పుడు టాప్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ నటించబోతున్నారని తెలుస్తొంది. ఇటీవల కూడా బోయపాటి శ్రీను అఖండ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నారు.
ఇక దీంతో రామ్ అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా లేవలో తెరకెక్కించడంతో ఈ సినిమా పై ఆశక్తి నెలకొంది. ఈ చిత్రాన్ని కూడా భారీ బడ్జెట్లో తెరకెకిస్తున్నారు బోయపాటి శ్రీను. ఈ సినిమాలో రామ్ యాక్షన్ సన్నివేశాలలో నటిస్తున్నట్లు సమాచారం. సెప్టెంబర్ లోనే ఈ సినిమాకి సెట్స్ మిదికి వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. దసరా పండుగ సందర్భంగా ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టి ఆ తరువాత రెగ్యులర్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి చిత్రంతో నైనా రామ్ విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి.