సినీ ఇండస్ట్రీ అంటేనే ఓ మాయా లోకం . ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు గెస్ చేయలేరు.. అలా సినీ ఇండస్ట్రీలోని మాయకి బలైన హీరోస్ హీరోయిన్స్ ఎంతోమంది .
తాజాగా ఆ లిస్ట్ లోకే యాడ్ అయింది కన్నడ బ్యూటీ కృతిశెట్టి . మనకు తెలిసిందే మెగా హీరో ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా పరిచయమైన కృతిశెట్టి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది.
అంతేనా మొదటి సినిమా హిట్ అవ్వడంతో ఆమెకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. దీంతో కృతి శెట్టి నానితో శ్యామ్ సింగరాయ్, నాగచైతన్యతో బంగార్రాజు లాంటి బ్లాక్ బస్టర్ హీట్లను వరుసగా తన ఖాతాలో వేసుకుని హాట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.

అయితే తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచింది అన్నట్టు.. వరుసగా మూడు సినిమాలు హిట్లను అందుకున్న బేబమ్మా.. వరుసగా మూడు ఫ్లాప్ సినిమాలను తన ఖాతాలో వేసుకుని బాక్స్ ఆఫీస్ వద్ద పరమ చెత్త టాక్ ను సంపాదించుకుంది. అంతేకాదు ఈ మూడు సినిమాల్లో కృతి పర్ఫామెన్స్ టూ వరస్ట్ దరిద్రంగా ఉన్నాయంటూ కామెంట్లు వినిపించాయి. దీంతో కృతి టైం బ్యాడ్ అంటూ నెటిజన్స్ ఆమెను ట్రోల్ చేస్తూ ఉన్నారు. అంతేకాదు కృశెట్టి నే డైరెక్ట్ గా కొన్ని రోజులు సినిమాకు బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నాను అంటూ ప్రకటించడంతో కధ అడ్డం తిరిగింది. ఈ క్రమంలోనే కృతిశెట్టి లైఫ్ ను మార్చడానికి మెగా హీరో రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది.

మొదటి సినిమాతోనే హిట్ పెయిర్ గా టాక్ సంపాదించుకున్న వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి కలిసి మరో సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తుంది . ప్రస్తుతం ఇదే న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చింది .అంతేకాదు ఈ సినిమా ప్రపోజల్ ను వైష్ణవ్ తేజ్ కృతి శెట్టి దగ్గరికి తీసుకెళ్లారట. రీసెంట్ గా రంగ రంగ వైభవంగా సినిమా తో పాజిటివ్ హిట్ అందుకున్న వైష్ణవ తేజ్.. త్వరలోనే మరో లవ్ స్టోరీని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడట. ఈ క్రమంలోనే హిట్ పేరుగా జనాలకి ఎక్కిన కృతిశెట్టి వైష్ణవ తేజ్ కలిసి నటిస్తే జనాలకు మరింత నచ్చుతుందని.. అందుకోసమే బేబమ్మను రిక్వెస్ట్ చేసి మరి ఈ పాత్రకు ఒప్పించాడని తెలుస్తుంది. దీంతో అందరు కృతిశెట్టి పాలిట వైష్ణవ్ తేజ్ అదృష్ట దేవుడిగా మారిపోయాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి చూడాలి ఈ అదృష్ట దేవుడు కృతి లైఫ్ ను ఎలా బాగుపరుస్తాడో ..?

మరింత సమాచారం తెలుసుకోండి: