సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి నిన్నటి రోజున అనారోగ్య కారణంగా మరణించిన సంగతి అందరికీ తెలిసిందే.. ముఖ్యంగా మహేష్ బాబు కూతురు సితార తన నానమ్మను తలుచుకుంటూ ఆమె పార్దివ దేహం వద్ద ఎక్కి ఎక్కి ఏడ్చిన దృశ్యం ప్రతి ఒక్కరిని కలిచివేసింది. ఇక కూతురు ఏడుస్తూ ఉంటే మహేష్ దంపతులు సైతం ఆమెను ఓదార్చడానికి ఎంతో ప్రయత్నించారు. కానీ బుధవారం సాయంత్రం ఇందిరాదేవి అంతక్రియలు మహాప్రస్థానంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం అనంతరం ఆమెను తలుచుకుంటూ మహేష్ భార్య నమ్రత సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్టులను షేర్ చేస్తూ ఉన్నారు.


అలాగే సితార కూడా బాగాద్వేగా పోస్ట్ షేర్ చేయడం జరిగింది.. ఇక  తన సోదరుడితో కలిసి ఉన్న నానమ్మ ఫోటోలు షేర్ చేస్తూ మిస్ యు సో మచ్ నానమ్మ నువ్వు మళ్ళీ తిరిగి రావాలని కోరుకుంటున్నాను అంటూ ఒక ఎమోషనల్ చేస్తూ హార్ట్ బ్రేకింగ్ ఎమోజిని జత చేసింది.. ఇక నానమ్మను కోల్పోయిన సితార పడుతున్న ఆవేదన అందరి మనసులను కలిచివేసేలా చేస్తుంది. సితారకు తన నానమ్మతో చాలా ఎమోషనల్ బాండింగ్ ఉందని చెప్పవచ్చు ఎలాంటి పండుగ వచ్చిన కచ్చితంగా తన నాన్నమ్మ దగ్గరకు వెళుతూ ఉండేది.


 అలా అక్కడ ఆరోజు అంతా సంతోషంగా గడుపుతూ ఉండేదట. ఇక తన కుమారుడికి సరైన కూతురివి నువ్వే అంటూ సీతారా ను కూడా ఎన్నోసార్లు మెచ్చుకున్నదట అలాగే మహేష్ తన కూతురికి సితార అనే పేరు పెట్టినప్పుడు కూడా అందరికీ ఎంతో సంతోషంగా ఆ పేరు చెప్పిందట. ఇక సితార కూచిపూడి ,డాన్స్ ఇతర వాటిలో కూడా బాగా పట్టు ఉందని చెప్పవచ్చు అలాగే ఎప్పుడూ కూడా తన నానమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు సాంప్రదాయమైన దుస్తులలోనే వెళ్ళేది. అందుచేతనే తన నానమ్మకు సీతారాకు మంచి బాండింగ్ ఉందని చెప్పవచ్చు ప్రస్తుతం సితార పోస్ట్ చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: