టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయిన నిఖిల్ తాజాగా కార్తికేయ 2 అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కొన్ని సంవత్సరాల క్రితం విడుదలై మంచి విజయం సాధించిన కార్తికేయ మూవీ కి సీక్వల్ గా తేరకేక్కింది. కార్తికేయ 2 మూవీ లో నిఖిల్ హీరోగా నటించిన ,  చందు మండేటి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. అనుపమ పరమేశ్వరన్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. శ్రీనివాస్ రెడ్డి ,  వైవా హర్ష ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ ఆగస్టు 13 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే అద్భుతమైన టాక్ ని బాక్సా ఫీస్ దగ్గర సాధించుకుంది. ఈ మూవీ కి సౌత్ తో పాటు నార్త్ నుండి కూడా అద్భుతమైన కలెక్షన్ లు దక్కాయి. 

ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుని కలెక్షన్ ల వర్షం కురిపించిన కార్తికేయ 2 మూవీ మరి కొన్ని రోజుల్లో 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ ప్రముఖ 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో ఒకటి అయిన జీ 5 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో సెప్టెంబర్ 5 వ తేదీ నుండి స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ విషయాన్ని తాజాగా జీ 5 'ఓ టి టి' సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఎవరైనా ఈ మూవీ ని థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే సెప్టెంబర్ 5 వ తేదీ నుండి ఈ మూవీ జీ 5 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది చూసి ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: